పుట:2015.372978.Andhra-Kavithva.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


ఈవేదాంత ప్రసక్తి యేలకలిగినదనఁ బ్రాచ్యపాశ్చాత్య లాక్షణిక పద్ధతులకుం గల భేదమును సూచించుటకే. అది 'యెట్లో నిరూపింతుము.

విజ్ఞానోజ్జృంభణయుగము ఛాచాపర్ ,షేక్స్పియరు కవులు,


రోమను (ల్యాటిన్) సాహిత్యము క్షీణదశకు వచ్చి యందుఁగల నీరసకావ్యములకుఁ బ్రశస్తి హెచ్చి తన్మూలమున నైరోపాఖండ వాజ్మయము క్షీణదశకువచ్చునపస్థ వచ్చిన తరుణమున భగవంతుఁడు గొప్పవిప్లవముతో మత - సాంఘిక- రాజు కీయ - వ్యవస్థాపనల నన్నిటిని గబశింపఁజులునంతటి వైశాల్యము గలిగిన దానినిగాఁ బ్రసాదించెను. ఆవిప్ల వఫలితముగ నైరోపీయ విజ్ఞానము నూతనపథముఁ జరించి కొంచెము ప్రతిభాపక్షపాతము వహించి నిశ్చయ మైన కావ్యసృష్టికి గారణభూతమయ్యెను. ఈవిజ్ఞానవిజృంభణము ఇంగ్లాండు దేశమునఁ గావ్య రూపమున నమితఫలవంత మై దాసర్, షేక్ స్పియర్, మాగ్లో 'మొదలగుకవులు ప్రభవించుటకుఁ గారణ చుయ్యేను. వీరెల్లరును గావ్యము ప్రకృతికి శుష్క నీరసాను కరణము గాదనియుఁ, బ్రతిభావంతమగు స్వతంత్ర ప్రపంచ సృష్టియే యనియుఁ గావ్యములఁ బ్రపంచమునకుఁ బరిస్ఫుటము గావించిరి. వీరినిఁగూర్చి ప్రసక్తి గలిగినయ పసరముల మన దేశము నందలి కవులతోఁ బోల్చి గుణతారతమ్యచర్చకుఁ గడంగెదను. అంద చేత " బ్రకృతము ననుసరించి కొవ్వలక్షణము యొక్కనిర్వచనము పొందిన మార్పులను విశదీకరింప నెంచితిమి.