పుట:2015.372978.Andhra-Kavithva.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథము

22



పంటిది కాదనియు, నపూర్వ ప్రతిభాజన్యంబయి నూతన ప్రపంచ సృష్టిఁగావించి ప్రకృతిగర్భమున నడఁగియున్న పరమరహస్య, ములనెల్ల గోచరింపఁ జేయునది యనియు, మానవకల్యాణమునకు మతము, శాస్త్రము, ధర్మము లాదిగాగల ప్రయోజనముల. కన్న నెక్కువఁ దోడ్పడంగలదనియు విస్పష్టముఁ గావించిరి,

రోమను వాజ్మయ స్వభావము.

కాని గ్రీకునాగరికత యప్పటికే చరమావస్థనొంది భోగపరాయణత్వ ప్రధానమయిన రోమను నాగరకత విచ్చల. విడిగఁ బెచ్చు పెరుగసాఁగెను. అయ్యది భారతవర్ష ముసఁ బ్రబంధంచనకుఁ దావల మయిన దౌర్భాగ్యయుక్తకాలముఁబోలిన కాలము. అక్కాలమువారు దానినించుమించు మహాయుగమని పొగడిరి. కాని కావ్యాత్మ వినాశ సూచకముఁగుఁ బెక్కుడు. బొమ్మలు దక్క. ప్రతిభావంతమగు కావ్యసృష్టి విరివిగ జరిగి యుండ లేదని మాయాశయము, 'డాంటి, పర్జిల్ అను నీరువురు మహాకవులుదక్క నప్పటి కవు లెల్లరును సమకాలికాచార వ్యవహారములనే యున్న వున్నట్లు మన ప్రబంధ నియమములకుఁ దీసిపోవని కృత్రి మనియమములను గాప్యపోషణమున కై వలయు నుపొంగములుగ నేకరించుకొని కృత్రిమముసు సహజ ప్రతిభాశూన్యమును నగు లాక్ష్ణిక కాప్య పద్దతి నొక దానిని బయటికిఁ దీసిరి. వారికావ్యముల నసుసరించి పాశ్చాత్య దేశ ములఁ గొంతకాలము కావ్యవధూటీస్వచ్ఛందవిహారమునకు నిరోధము గలిగెను. విమర్శకులు వారిపద్దతిని వ్రాయఁబడిన కావ్యములనే ప్రశంసించుచు మిగిలినవానిని నిరసించుచుఁ గావ్యరచనకు సంబంధించిన 'సూత్రాత్మను మఱుఁగుపఱచిరి.