పుట:2015.372978.Andhra-Kavithva.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

21


తులకన్నను మత స్థాపకులకన్నను శాస్త్రకర్తలకన్నను నెక్కుడుగ గౌరవింపఁబడి వారియందటికన్న మిన్నయై పరమేశ్వరునితోడ నర్దసింహాసనాసీనుఁడగుననియు నగారా మ్రోయించి నటుల వాకుచ్చి గురుశిష్యు లికువుర సిద్ధాంతములను గాలి కెగురగొట్టి లాజ్గీనీసు రససిద్దాంతమునకుఁ బాశ్చాత్యులలో నెల్ల మార్గపర్శి యయ్యెను,

అనుకరణసృష్టి వాదములయొక్క భిన్న పరిణామములు.

లాజ్గీనీసు వాదము బయలు వెడలఁగనే అరిస్టాటిల్ వర్గమువారు కన్నులు తెఱచి తమతప్పు దిద్దుకొనుచుఁ బ్రత్యక్ష ముగఁ దా మంత వఱకుఁ బొరపడితిమని జెప్పుటకు మోమో టముఁ జెపినవారగుట 'సరిష్టాటిలు చే' నుపయోగింపఁబడిన ‘యనుకరణ' మనుపవమునకు ఛాయాపటరూపానుకరణ మర్థముగాదనియు, నట్టి యతీర్థము నరిష్టాటిలు గ్రంథమును విమర్శించిన ల్యాటిన్ వ్యాఖ్యాతలచే గల్పింపఁబడినదనియు నేదో విధముగఁ జెప్పి విచిత్ర సిద్ధాంతముఁ గావించుచు, సరిస్టాటిలును సమర్థింపఁజొచ్చిరి. కాని యరిష్టాలుచే నుపయుక్త మయిన యనుకరణ పదబీజము గ్రీకు,ల్యాటిన్ వాజ్మయ క్షేత్రముల దిట్టముగ నాఁటుకొని యనేకశాఖాపరివృతమగు వృక్ష ముగఁ బరిణమించి తుదకు శుద్ధనీరసొనుకరణ కావ్య విషఫలము లుద్భనము లగుటకుం గారణమయ్యెను. • పిన్హట నరిస్టాటిలునకు వ్యతి రేకముగ వ్రాసినలాడ్జినీసు మతము వారు దేశ కాలనియమముల బద్దులయి యుండి వాజ్మయము తొక్కుచున్న పెడదారుల పొంతఁబోవక సత్యైకపథ గాములై కావ్యము చూచినది చూచినట్ల చెప్పు దంపుడు పాట