పుట:2015.372978.Andhra-Kavithva.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్

19


ముగఁ బరిగణింపంబడి తరువాతి కావ్య విమర్శకులకు నాదర్శ ప్రాయ మయ్యెను. ఈయనుకరణ' మనుపదమునుగూర్చి వాదో పవాదములు చెల రేఁగుటకుఁ బూర్వము 'ఇటాలియన్ వ్యాఖ్యాత' లిర్వురు “ఆరిస్టాటిల్' గ్రంథమునకు వ్యాఖ్యానము సేయుచు 'ననుకరణ' మనుపదమును యథామాతృకమగు ఛాయనుకరణమని యన్వయించిరి. తోడనే వాదోపవాద ములు వెల్లుఁ బెరిగినవి అనేకు లారిస్టాటిల్ మతమును బూర్వ పశము సేయుచు రససిద్దాంతముఁ గావించిరి. అట్టివారిలో లాజ్గీ నీస్ ప్రముఖుఁడు."

3. లాజ్గీనీస్. కావ్యము స్వతంత్ర సృష్టియే .....కాని అనుకరణము కాదు.

'లాజ్గనీస్ కావ్యము ప్రకృతికి ఛాయాపటమునంటి యనుకరణము గాదనియు, నట్లయిన చోఁ బ్రపంచములో జను 'లాడెడు నీరసపుఁబల్కులును బ్రేలేడీ యవాకు చవాకులును, గావ్యమున నున్నవి యున్నట్లుగఁ జెప్పువా రెల్లరులు గవులు గావలసియే వచ్చుననియు, నట్టిదురవస్థ రసికులకు భాషావిషయమున నభ్యర్థనీయము గాదనియు, నట్టిదుర్మ తమువలనఁ గుకవులు జనించి వేన వేలు నీరసప్రహసనములను శుష్క ప్రలాపములను రచియించి లోభనీయమగు కావ్యసౌందర్యమును విసర్షించి పాఠకులరసికతను నాశముఁ గావింతురనియుఁ, బూర్వ పక్షముసేసీ వేరొక కావ్వలక్షణమును నిరూపిం చెను. అది యెద్దీ యనిన, కావ్యము ప్రపంచమునకు యథామాతృకమగు ఛాయనుకరణము గాక దానితో సరిసమాన మైనదియు, స్వతంత్రవ్యక్తి గల్గినదియు నగు ప్రతీసృష్టియే యనియు,