పుట:2015.372978.Andhra-Kavithva.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావ ప్రకటనము

289


తనకాలమునం దన్ననో మానవులు పవిత్ర భావోద్రేక పూరితులై, నిర్మల మానసులై, సృష్టి సర్వమును భగవన్మయ ముగనే భావించి, భక్తియుతులై జీవిత పరమార్గమును గ్రహీం పగలిగిరి. ఈ వాక్యములకు ప్రాచీన మానవసంఘములలో నెల్ల నగ్రస్థానము వహించిన భారతీయార్యుల చరిత్రయే తార్కాణము. భారతీయ విజ్ఞాన నిధియును భారతీయ నాగరక తా పేటిక యును నని చెప్పఁదగిన వేదములును పురాణములును నిందులకుం దార్కాణములు, వానియం దెచ్చటఁ జూచినను నాలో చన కందని యపూర్వగాథలును, తర్కమునకు వశముగాని, యద్భుత ప్రాపంచిక రహస్యములును, సామాన్య మనుష్యానుభవ మునకు విపరీతముగఁ దోచు గాథలును, సామాన్య మానవ బుద్ధికి దోఁపని వింతవింత యూహలును; నతిశయోక్తులును మిక్కుటముగఁ గన్పించును. దీని కంతటికిని కారణము ప్రాచీన, భారతీయుల యాత్మ నైర్మల్యమే, శైశపస్వభావమే, ప్రొపంచి కాద్భుత పరిజ్ఞాన మే, పంచ భూతాత్మకమగు నీ ప్రపంచము కల్ల కపట మిసుమంతయు నేఱుంగని ప్రాచీన భారతీయులకు నద్భుత జనకమును దివ్య తేజః ప్రదర్శకమును, భగవన్మయముగను. గన్పించెను. తోడనే వారు మంత్ర గానము సల్పిరి. "ఆమంత్ర గానము మొట్ట మొదట ఛందో బద్ధమగు ఋక్కులరూపముసc 'జేయఁబడెను. అయ్యది పోనుపోను | పద్యవృత్తరూపములం బరిణమిం చెను; వేదము యొక్క షడంగములలో, ఛందస్సు ఒక టిగా గ్రహింపఁబడుటయే పై యూహలకు నిశ్చితమగుదార్కా ణము, ఇంతియేగాక భారతీయులలో నెల్ల నాదికవి యనఁడగు వాల్మీకి హ్యధనిహతమైన, క్రౌంచమును గాంచిన తోడనే శ్లోక రూపమునఁ దనశోకమును వెలిపుచ్చినవిధమే పై సిద్ధాంతమును

ఆంధ్రకవిత్వ-19