పుట:2015.372978.Andhra-Kavithva.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

రసాత్మకం వాక్యం కావ్యం .

9


ల్లోపములను గణింపక ప్రధానగుణమునే గ్రహింపవలె నను టయే. ప్రపంచస్వభావ వేత్తలకును, సృష్టి రహస్య వేదులకును, నీవాదములోని సత్యము గోచరింపకమానదు. ప్రపంచస్వభావము గుర్తెఱుఁగక భగవంతునికే చెల్లఁదగు దోష రాహిత్య మును సదోషుఁడగు మానవున 'కారోపించి కావ్యమున నే లోపమును నుండఁదగదని శాసించుట న్యాయము కాదు.

ఇంకొకవిషయము: ప్రతిమానవునియందునను బర మేశ్వరుని తత్త్వ మున్నను ప్రతిమానవుఁడును, సర్వశక్తి యుతుఁడును లోపరహితుఁడును నగుపర మేశ్వరుఁ డెట్లుకాఁ జాలఁడో అట్లే కావ్యమున సౌందర్యమును, రసమును బ్రథా నము లైనను నేలోపము లేని పరిపూర్ణ సౌందర్య ముండుట యరుదు. కావున, కొద్దిలోపము లున్న ను వానిని గణింపక ప్రధానవిషయములగు రసమును, కావ్యసౌందర్యమును గ్రహించినఁ జూలును. -

సహజసౌందర్యమే ఎక్కువ భావోద్దీపకము.

మఱి యొకవిషయము: ప్రపంచమున నేదేని సంబంధ మున్నఁగాని యను రాగమును ననుకంపయు నుదయింపఁజాలవు. దగ్గరి చుట్టముల కష్టసుఖములకు దుఃఖమును, సంతోషమును బొందుదుము. కాని యెవ్వరో సంబంధము లేని వారినిఁగూర్చి సంచలనముఁ బొందనే బొందము. హృదయసంబంధమే యను కంపాను రాగములకుఁ గారణము. అట్లే కావ్యమునను మానవులకు సహజమగు స్వభావసౌందర్య మే హృదయమును గరంచి మనస్సున కానందము నిచ్చును. కాని, లోకమున నెచ్చటను కానుపింపని లోపరహితమగు నుత్తమసౌందర్యము రుచింప