పుట:2015.372978.Andhra-Kavithva.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును

177

2. రసమునకును మానవజీవితమునకు గలసంబంధము.


పై నఁ జెప్పఁబడిన ప్రకరణమున రసము ధర్మార్థముల నాశ్రయింపక కామమునే ప్రధానముగ నాశ్రయిం చుననియు, కొన్ని విధముల మోక్షమును గూడ నాశ్రయించుననియుఁ దెలిపి యుంటిని. ఇప్పుడు కవి యేమిపనిఁ గావించునో, రసభావము వృద్ధినొందుటవలన జీవితమున కవిలాభమో ఎట్టివికాసమో నిరూపింపఁ బ్రయత్నించెదను. అనంతకోటి జీవరాసులలోఁ గవి యెట్టివాఁడో, యేస్థానమున కర్షుఁడో, రసమువలన నెట్టి ప్రయోజనము సిద్దించునో తెలుప యత్నించెదను. ముందుగాఁ గొన్ని దుర్వాదములను, విపరీతాభిప్రాయములను గుళంకలను. నిర్మూలముగ ఖండించీ పిమ్మట కవియొక్క ప్రాశస్త్యమును గూర్చియు రసముయొక్క ప్రయోజనముఁ గూర్చియుఁ బ్రసంగించెదను.

కావ్యము యొక్క ప్రయోజన మానందజనకత్వ మే

గత ప్రకరణమున రసమునకును ధర్మార్థములగును విరోధమును వైపరీత్యమును గలదని తెలిపితిమి. ఆసిద్ధాంతమును బురస్కరించికొని "కవిత్వమునకు శాస్త్రమునకు సవతిపోరాట మనుచున్నారే. శాస్త్రము ధర్మమును బోధించుననుచున్నారు. కవి నిరంకుశుఁ డనుచున్నారు. వేరొకవంక శాస్త్రమునకు శాసనాధికారము కలదనుచున్నారు. ఇదియంతయుఁ జూడఁ గవి తాను విచ్చలవిడిగ శాస్త్రములను దిరస్కరించి సంచరించు టయేక యితరులఁగూడ శాస్త్రములమీరి నడచుకొనుఁ డనియు, నధర్మమూర్గమునఁ జరింపుఁ డనియు బోధించున ఆంధ్ర కవిత్వ-18