పుట:2015.372978.Andhra-Kavithva.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

2


సంస్కృతమున రసచర్చఁ గావించిన లాక్షణికులు రెండు కక్షలకుం జేరి యున్నారు. ఒకపద్దతివారు శాస్త్రా దేశము శిరసా వహించువారు. రెండవపద్దతి వారు స్వచ్ఛంద ప్రకృతి మార్గముల సనుసరించి శాస్త్ర దేశమును గొన్ని యెడల మీటి రసమునే ప్రధానలక్ష్యముగ సంగీకరించి 'కావ్యలకుణమును నిరూపిం చిరి. శాస్త్రా దేశము ననుసరించి కావ్యలక్షణమును నిర్వచించిన లాక్షణికులలో జామనుఁడును, వాగ్బట్కుడును, భోజుడును, మల్లి నాథుఁడును, విద్యానాథుఁడును ముఖ్యులు. శాస్త్రా దేశ మును ప్రధానముగ గణింపక రసప్రవృత్తియే ముఖ్యసూత్ర, ముగఁ గైకొని కావ్యస్వరూపమును జిత్రించినవారిలో దండి, మమ్మటుఁడు, విశ్వనాథుఁడు, జగన్నాథపండితుఁడును ప్రము ఖులు. ఈయిరు తెగలవారిమతముల ముఖ్యసూత్రముల నిందుఁ బొందుపఱచుచున్నాను.

1, కావ్యశబ్దోయం గుణాలం కారసంస్కృతయోశ్శబ్దార్థ యోర్వర్తతే. రీతి రాత్మా కావ్యస్య --- వామనుఁడు."

2. సాధుశబ్దార్థ సందర్భం గుణాలంకారభూషితమ్, స్ఫుటరీతిరసోపేతం' కావ్యం కుర్వీత కీర్తయే, -వాగ్భటుఁడు

3. నిర్దోషం గుణవత్కావ్య మలంకారై రలంకృతమ్, రసాత్మకం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతిం చ విందతి. -భోజుఁడు.

4. అదోషు సగుణె సాలంకారౌ శబ్దార్థా కావ్యమ్. -మల్లి నాథుఁడు.

5. గుణాలంకారసహిత్ శర్ఘ దోషవర్జితా! గద్య పద్యోభయమయం కావ్యం కావ్య విదో విదుః. -విద్యానాథుఁడు.