పుట:2015.372978.Andhra-Kavithva.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

రసజన్మ కారణము భావానుభవమే.

భావానుభవమే రసజన్మ కారణమని యిదిపటికే తెలిసి కొంటిమి. అట్టిభావానుభవమే వివిధ ప్రస్తార భేదములనొంది తుదకు స్థాయీభావముగఁ బరిణమించి సిద్ది. బడయు నేని ప్రకృతము హెచ్చరికఁ గావించు చున్నాను. కావున స్థాయీ భావము సిద్ధించుటకుఁ ప్రథమమున నిసర్గ టైశ్యుముగల భావా సుభూతి కారణముగ జనింపవలెను. అట్టిభావానుభూతి యకా'రణముగ జనించునని తెల్పియుంటిమి. అట్టి యకారణజనిత భావానుభూతిఁ గవియొక్క జన్మాంతర లబ్దసంస్కారబలమే యాధారమును, కారణమును నగునని తెల్పితిమి. కవియొక్క, చిత్తసంస్కారమునకుఁ బరమేశ్వరుని యవ్యాజకరుణయే మూల "కారణము. అట్టిజన్మ ప్రకారమునే వైదిక ద్రష్టలు సదనాద్రి తస్య మనుపలుకులను, నాలంకారిళులు అలౌకిక యను విశేషణము నను సూచించిరి. సూచితమాత్ర పూర్వములగు నీవిషయముల సవిమర్శముగఁ జర్చింతము,

భావోదయమునకు జనాంతర సంచిత చిత్త సంస్కారమే కారణము.

భావోదయమునకుఁ గారణ మేమి? అకారణముగ భావో దయ మగుననియు, జన్మాంతర లబ్దమగు చిత్తసంస్కారమే యందుకు మూల కారణ మనియు సూచింపఁబడినది. ఈభావమే యీ క్రిందిపద్యములను ధ్వనించుచున్నది.

 ప్రేమకారణము. కారణం బేమనందునో 'కాంత,
నీదు ముద్దుమోమందమో లేక, మోహపార