పుట:2015.372978.Andhra-Kavithva.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసస్వరూపనిరూపణము,

89


చున్న దగుచుఁ బూర్వమువలే నా రెంటికలయిక చే లోకోత్తర భావము నే పొందుచున్నది. కాని, వైరుధ్యమును గలిగించు నది గాదు.

గుప్తసాదాచార్యుల యభిప్రాయమున రసమునకును, విభావాను భావాద్యంతరములకును గార్య కారణసంబంధము లేదని రూఢియగుచున్నది. ఆచార్యులమతమున రసము సవి కల్పకమును నిర్వికల్పకమునుగూడ నయియున్న దని - అనఁగా రసము చిరస్థాయిగఁ గొంత కాలము మాత్రమే నిల్చుననియుఁ, గొంత కాలము విభావానుభావ సంచారీ వ్యభిచారిస్థితుల నందు చుండుననియు సూచింపంబడినది. దీనియంతటికిని స్థూలార్థ మేమనఁగా:- రసము నిశితమగు నతి తేజముతోఁ గోండొక కాలముమాత్ర మే ప్రదర్శింపయోగ్య మగుననియు, మిగిలినపట్ల నట్టి తైక్ష్యము తగ్గిపోవుననియుఁ, గావ్యమున రసమునకు జీవ స్థాన మతి తైక్ష్యముఁ బ్రదర్శించుపట్లగల స్థాయీభావమే యయినను నట్టిస్థాయీభావమును బోషించుటకును, దోహ దముఁ జేయుటకును వివిధములగు విభావానుభావములు వలయు ననియుఁ దెలియుచున్నవి. \

కావ్యమునకును చిత్ర శిల్పమునకును గల భేదము. 1. చిత్ర శిల్పములయందు రసముయొక్కస్థాయీభావమే, అనఁగా, నిశితతీక్ల తయే ప్రదర్శిత మగును. కావ్యమున వివిధ భావములు వర్ణితములగును.

ఇప్పట్టున శబ్దరూపమున నుండుకావ్యమునకును వర్ణ శిలారూపముల నుండు చిత్ర,శిల్పములకును భేదము లరయు -