ఈ పుట ఆమోదించబడ్డది
సందర్భమున మూడునాలుగేండ్లుమాత్ర మాయన నాగపురమందుండెను.) అప్పుడప్పుడు విదేశయాత్రలకు పోయినను కొన్ని నెలలకు బొంబాయి చేరుచుండెను. బొంబాయిపౌరుడగుటచే, జంషెడ్జి కానగరముపైన నమితాభిమానముండెను. ఆతని కాడంబరమన్నను వక్తృత్వమన్నను ఇష్టములేదు; ఎన్నడును మునిసిపలుసభ్యుడగుటకు యత్నింపలేదు; కాని పైకి తెలియకుండనే, బొంబాయి నగరపుఆరోగ్యమును విద్యాదిసౌకర్యములను హెచ్చించి, దానినిసుందరముగ జేయుటకాయన చాల కృషిచేసెను. (తనజన్మస్థలమగు నవసారిలోను ఆయన పాఠశాలలను భవనములను ఆరామములను నిర్మించెను.) బొంబాయియే మనదేశపు ప్రధానపురమని, అది ఆదర్శనగరము కావలెనని ఆయన ఆశయము.
జంషెడ్జితాతా ప్రవేశించునప్పటికి బొంబాయి యిప్పటి స్థితికి రాలేదు. అది సముద్రతీరపు ద్వీపపుంజము; మొదట