పుట:2015.370800.Shatakasanputamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈనరసింహశతకము రచించినకవి గోగులపాటి కూర్మనాథుఁడు. ఇతఁడు విశాఖపట్టణమండలనివాసి. [1]లక్ష్మీనరసింహసంవాదము (పద్యకావ్యము) మృత్యుంజయవిలాసము (యక్షగానము) అను రెండుపొత్తము లీకవి రచించినవి మేము చూచితిమి. కవి క్రీ. శ. 1750 ప్రాంతమునందుండి యుండును. ఇతని యితరగ్రంథములవలన నితఁడు ఆపస్తంబుఁ డగు ముద్గలగోత్రుఁడనియు నాఱువేలనియోగియనియుఁ బెద్దింటి సంపత్కుమార వేంకటాచార్యులశిష్యుఁడని తెలియును.

ఆంధ్ర దేశములో సింహాచలము సుప్రసిద్ధమగు నృసింహక్షేత్రము. తురకదండు ఆంధ్రదేశమునకు దాడి వెడలి మార్గమధ్యమున నున్న గ్రామములు గాల్చుచు జనులఁ బీడించుచు సతులమానభంగము గావించుచు పొట్నూరు, భీమసింగి, జువ్వి, చోడవరము లోనగు గ్రామములలోని దేవాలయముల రూపు మాపి సింహాచలము ముట్టడించెను. ఆలయమండపములలో గోహత్య గావించి బ్రాహ్మణాదుల బరాభవించి సతుల యభిమానధనములు చూఱగొని తురక లెన్నియో దుండగములకుఁ బాల్పడిరి.

  1. దీనినే చోరసంవాదమని చెప్పుదురు.