పుట:2015.370800.Shatakasanputamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

సోమనాథకవి యాంధ్రసంస్కృతకర్ణాటభాషలలో నుత్తమగ్రంథములు పెక్కు రచించెను. అన్నియు మతవిషయికములే. ముఖ్యముగ బసవేశ్వరుని లీలావతారాదులను బసవపురాణములోఁ గొనియాడి దానితోఁ దనివినొందక పిదప నీశతకమును రచించి తనయప్రతిమానభ క్తిని లోకమునకుఁ దెలుపుకొనెను. సోమనాథుఁ డీశతకమునఁ దనకవితను బెక్కుతెఱంగుల నలంకరించెను. "బసవన్న దండనాయకునకు" అను సోమనాథుని పద్యపాదమువలన బసవేశ్వరుఁడు రాజకీయముగఁ గూడ సుప్రసిద్ధు డనుట విశ్వసనీయము.

సోమనాథకవి కాకతీయరుద్రదేవునికాలమున నుండెను. ఇతనినిఁ దరువాతి శైవకవులు దైవస్వరూపముగా భావించినటుల గ్రంథాదికమువలనఁ దెలియుచున్నది. ఈశతకమువలన సోమనాథుని నిరర్గళకవితాధారయు సుప్రసిద్ధులగు వీరశైవమతనిర్మాతలచరిత్రములు బసవేశ్వరుని దైవలీలలు కవికిఁగల బహుభాషాపరిచయము సువ్యక్తము కాగలదు. కవి క్రీ.శ. 1150. ప్రాంతమున గ్రంథరచన మొనరించుచు సుప్రసిద్ధుఁడై యుండెను. ఇతఁడు నిజామురాష్ట్రములోని ఓరుగల్లు చెంతగల పాలకురికిలో సిద్ధినొందెను. కాన నితఁడు నిజామురాష్ట్రకవి.


నందిగామ.శేషాద్రిరమణకవులు.