ద్వాంసుల్ రాజమహేంద్రపట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావమనుచున్ దర్కింతులెల్లప్పుడున్.
ఈముదుకపరిహాసమునకు దార్కికులు నాటికి నేటికిని పంపవలసినదే గదా ! మహావిద్వాంసుడయ్యు శ్రీనాధుడు డిట్టి స్త్రీలౌల్యమునజెడ్డాడని రాజమహేంద్రవరమున సోమయాజులు నిరసింపగా శ్రీనాధు డీ పద్యమును జెప్పెనట.
మ.శృతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుడంత నానాధ్వర
వ్రతుడై పోయి కనున్ బురందరారామద్రుమానల్పక
ల్పతరుప్రాంతలతాకుడుంగసుఖసు ప్తప్రాప్తప్తరంభాభగ
ప్రతిరోమాంకురపాటవక్రమకళాపాండిత్యశాండీర్యమున్.
ఆ యాక్షేపమును నీసమాధానమును వివేకులు విమర్శించి చూచినచో నిది శ్రీనాధుడే చెప్పదగిన పద్యమని తప్పకతోచును. ఈ పద్యముతో రచనాసామ్యము గల
పద్యము తిక్కనది గలదు.
‘చ. ఉలిమిడిచెక్కయున్ మిగులనుక్కయు జప్పని రొట్టె
ముక్కయున్
మలినపుగుడ్డలున్ నులకమంచపుగుక్కియు జీకటిల్లునుం
—————————————————————————————————————————————————————————- ^ బహుస్థలముల నిది శ్రీనాధకృతముగా నాకు వినవచ్చెను. శ్రీ డి. పిచ్చయ్యశాస్త్రి గారు చాటుపద్యరత్నాకరమున శ్రీనాధకృతముగా జేర్చిరి. శ్రీ జం. తమ్మయ్యగారు పగటిభాగవతపువేనగాయ చెప్పినదిగా దాము వ్రాసిరి. సిమో!