ఈ పుట అచ్చుదిద్దబడ్డది
బ్రాహ్మణుడు భ్రష్టుడై చండాలకన్యతో సంగమించుటను జెప్పుసందర్బమున నీయశ్లీలము గొంత యౌచితి గలదేయగునని తలచి నిరంకుశుడై శ్రీనాధు డిట్టిరచన జేర్చెను. క్రీడాభిరామమందలిరచనలు నిట్తివే. అంధ్రకవులలో శ్రీనాధునకు బూర్వ మిట్టిరచనలను జేసినవారు గానరారు.
నన్నిచోడడు మాత్రము:
క.స్మరమందిరమ్ము శోబా
కరముగ మెఱుగారుపసిడికంబము లనగా
గరమెప్పు నగతనూజకు
గరభోరులు వొలుచు మదనకరికరలీలన్
(కుమార సం. 3-48)
గీ. అదిమి పట్టిన గరులైన జదియునట్టి
కడిదిబలు లగుమగ లొత్తి గౌగిలింప
గురుమకోమలు లగుసతుల్ గొనరుచునికి
గనియు నెఱుగవె విపరీతకామశక్తి. (కుమార సం. 4-79)
అని యించుక హద్దుదాటి కుమారసంభవమున
రెండుపద్దెముల జెప్పెను.
శ్రీనాధుని శీలము
సత్ప్రబంధములందు గూడ నిట్టిరదనలను సంకోచింపక నిరంకుశముగా జొప్పించుటకు శ్రీనాధునిశీలమెట్టిదై యుండదగునో యించుక యోజించిన గోచ