పుట:2015.333901.Kridabhimanamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పారీణయై యున్నయవారముఖ్యం జేరియాసనార్ఘ్య
పాద్యాదిసముచితసత్కారంబులంబొంది సుఖాసీనుండై.
                      ముకురవీక్షానిధి
ఉ.గొత్రమువార లెల్ల గేడ
       గూడినవారు వ్రతంబొ; దేవతా
   యాత్రయొ; పండువో: మనగృ
          హంబున శొభన మేమి ? శోభబణ్
   బత్రిసమాన: నేటియప
         రాహ్ణసమాగమవేళ బుష్యన
   క్షత్రమునందు నీయనుంగు
          గాదిలికూతురు చూచు నద్దమున్ 194
క. ఆవేళ నీవు బిడ్దకు
    దీనసమంత్రంబు చెప్ప దీర్ఘాయు నగున్
    లావణ్యంబు వివేకము
    ప్రావీణ్యము వైభవంబు భాగ్యము గలుగున్ 195
గీ. ముకురవీక్షావిదానంబు మొదట లెక
    వెలపడంతికి గారాదు విటుని గవయ
    యాయజూకున కెట్లు చేయంగవచ్చు
    నరణిసంగ్రహ మొనరింప కధ్వరంబు ? 196