పుట:2015.333901.Kridabhimanamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. ఉపమించెద ధారాధర
    తపనజ రై రాజ రాజ ధారానగరా
    ధివ ధారాధరవాహుల
    ద్రిపురాంతకవల్లభుని వితీర్ణిప్రౌఢన్ (క్రీడా.. 29 వ)

అని యున్నది. మఱియు గృత్యవపానపద్యమున గాల భైరవుడు కవీంద్రకాంక్షితత్రిదశమహీరుహ మగువల్లధ రాయనికి సమగ్ర వైభవాభ్యుదయములు కృపసేయు నని యాశీర్వచన మున్నది. సూత్రధారోక్తిగాను భరతోక్తిగాను నయిన గ్రంధకర్తయగువా డిట్లు చెప్పుకొనుట సరసముగాదు. ఇది తానే తుమ్ముకొని, తానే శతాయుస్సని యనుకొన్నట్టున్నది. కవీంద్రకాంక్షితత్రిదశమహీరుహము గావున వల్లభరాయుడుఇ విశేష ధన మొసగి కవియశఃకాంక్షియై యేతత్క్రర్తృత్వమును దనపై వేయించు కొన్నాడని తలచుట ప్రమాణదూరముగాదు. అట్టి సంప్రదాయము గూడ నా కాలమున హెచ్చుగా గలదు.

శ్రీనాధుడు తన గ్రంధములలో గొన్ని పద్యములను, బద్యభాగములను, భావములను మార్పు చేయక యొకతీరుననే కూర్చుకొనుచు వచ్చినాడు. స్వరచనమే యగుటచే సరిపడినపట్టులందు ముందు రచించిన గ్రంధములలోని కూర్పులను జేర్చుకొనుట దోషము గారు గదా! తిక్కనాదులు గూడ నిట్లు చేసిరి. ఎన్నటికినిగూడ గ్రీడాభి