ఈ పుటను అచ్చుదిద్దలేదు
యీ దృశ్యప్రబంధము ()కావ్యపరముగ) నని గాని - లేదా తన యీ ప్రబంధల్మున కాధారమైన వీధిని అని గాని కవి భావమై యుండవచ్చును.
2. రూపకాంతమున వల్లభరాయని రచనలో 'జారజాయాపతులు - నిండుజందురున కర్ఘ్యమిచ్చి ' మ్రొక్కిన పిదప - నందరు నిష్క్రమింతురు అని రూఒపకము అన్నిటవలె నుండియుండును. దానినేప్రబంధీకరించినాడు కావున శ్రెనాధుడు 'అని యందఱును యధాసుఖంబుగ నిజస్థానంబుల కరిగి సుఖియించుచుండిరి ' అనినాడు.
3. ఈ కారణముననే గ్రంధాంతగద్యలో 'వల్లభరాయప్రణీతంబైన క్రీడాభిరామమున సర్వంబు నేకాశ్వాసము ' ననినాడు. ప్రణెతమైనది యేకాంకముగల వీధీ నాటకమే. కాని యిదిమాత్ర మేకాశ్వాసముతో నున్న ప్రబంధము. నాటకమునందలి యంకముల నిట్లు ఆశ్వాసములుగా జేసి నాటకప్రబంధమ్లు గూర్ఫినకవు లా కాలమున మఱికొందరు లేకపోలేదు.
4. ఇది రూపకమైంచో (మూలము ననుసరించుచు) నందున్న ప్రసంగములు మాత్రమే యిందు నుండదగును. కాని యీ వీధీనాటకప్రబంధమున మూలమున లేనివనదగినవి "పటుఝుంఝూ" (60) "బంగారుతలుపులు" (287),