ఈ పుటను అచ్చుదిద్దలేదు
"మల్లనమంత్రికిం ద్రిపురమాతరళాక్షికి గాంతి రోహిణీ
వల్లభు లాత్మసంభవులు వల్లభ లింగన తిప్పన క్షమా
వల్లభమంత్రిశేఖరులు వారవధూజన పుష్పభల్లు లు
త్ఫుల్ల యశోవిభాసితులు పుణ్యులు సింగనభైరవేంద్రులున్.
వ. అందు,
సీ. తారకామందార తారాచంలంబుల
తో రాయు నెవ్వాని చారుకీర్తి......
మర్త్యమాత్రుండె వల్ల భామాత్యవరుడు.
(క్రీడా. 10, 11, 12)
ఇటాఅందు ' అనగా నైదుగురు సోదరులలోను మొదటివా డగువల్లభుని అని. అతనివర్ణనము సీసములోనున్నది. అంవయమొ కేవిధమున జక్కగా బ్రధమలో పద్యమున దుది దాకుచున్నది. ఇట్లే ప్రస్తుత భాగమున గూడ నన్వయము.
"...తిప్పన యఖండిత ధీనిధికాంచె బుత్రులన్
బాంధవ కల్పవృక్షముల బైచన మల్లన(?)తిప్పమంత్రులన్.
వ.అందు,
సీ. 'మూడు గ్రామగ్రాసముల ' (22 పద్యము)
ఈ సీనమున దొలి నాలుగుచరణములలో నున్న విశేషము లన్నియు 'నెవ్వ 'డను శబ్దముచే ప్రధమవిభక్తిలో విర్ణితుడైన వల్లభునకె చెల్లును. ఇక పైవచనమున 'అందు ' అనుట 'బై చన మల్లన(?) తిప్పమంత్రు ' లలో వనుట్కు. కాని యందు వల్లభుడు కానరాడు. అందుకే 'మల్లన '