ఈ పుటను అచ్చుదిద్దలేదు
కవితావిమర్శము
శ్రీనాధు డాంధ్రపద్యముల కబ్రపునిబ్బరపునడక నేర్చినవాడు. శయ్యాసౌభాగ్య మాతనిరచనలలో సర్వత్ర యతిప్రాసమై సాగును. నన్నయ, వాచనసోమన తొలుత నిట్టిత్రోవ ద్రొక్కిరి. శ్రీనాధుడ్ దాని ఘంటాపధము గావించెను. అన్నియర్హతలకంటె నధికముగా శయ్యాసౌభాగ్యమునే శ్రీనాధుడు చక్క జూచుకొనును. ఈ క్రింది పద్యము జదువుడు.
శా. ఆకాశాందలవీధుల న్నిగిడె సంధ్యారాగరేఖావశుల్
పాకోన్నిద్రిత పారిభద్ర పటలీ పాండిత్య వైతండికో
త్సేక స్ఫూర్జిత చండ తాండవ రయోద్రేకారభ ట్యుదృట
శ్రీకంఠ స్థిరకంఠ కోమల జటాశ్రేణి న్విడంబించుచున్
(భీమ. 2-32)
శయ్యలిగింపేకాని యిం దర్ధంపుపొం పేమున్నది? ఆకాశాంచలవీధులందు సంధ్యారాగరేఖలు సాగినట్లే యీ పద్యము ప్రధమచరణమున బదరచన సాగినది. తక్కిన చరణములును దానికి దగినట్లు నెగడినవి. కొన్నిచోట్ల నిట్లున్నను నెన్నోచోట్ల శ్రీనాధుడు శ్రవణమాత్రముననే సంతోషము గొల్పజాలు గడుసరినుడికారములను సంస్కృతాంధ్రములలో జతపఱచి సరసార్ధముతో జతురరచనల నెఱపెను.