పుట:2015.333901.Kridabhimanamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనకధాపాత్రము లట వెడలికొంత చనగామ్రైలార వీరభటులు గావచ్చిరి. 'మైలారదేవర ' భైరవుని తోడజోడట! స్కాందపురాణమున నేతన్మాహాత్మ్యము జెప్పుఖండము 'మైలారఖండ ' యొకటి గలదు. మైలారవీరభటుల చేష్టలలో గొరగవడును చేయువింతలు గొన్ని వర్ణితములయ్యెను (చూ, 143, 144 వ), ఆవింతల నిప్పుడును దొమ్మరి పడుచులు ఛేయుచున్నారు. గొరగలు శివార్చాపరు లగు దేశద్రిమ్మర తెగవారు గాబోలును. అట కొంత చనగా నీక్రిందిదేవళము లొక్కటొక్కటిగా గానవచ్చెను. భైరవుని గుడి, చమడేశ్వరీ మహాశక్తినగరు, వీరభద్రేశ్వరాగార మంటపము, బౌద్దవిహారము, ముద్దరాలు ముసానమ్మవసతి, కొమరసామిగుడి, పాండవులగుడి, తురకమసీదు- వీని కన్నింటికిని నవ్వల గొంతదనారాస గోపురములమీది బంగారుశిఖరములు రవిదీప్తిని బ్రజ్వలించి మేరుశిఖరములుంబోలెదోపగా కేశవస్వయంభూదేవుల దేవాలయములును గానవచ్చెను. అప్పటికి మధ్యాహ్నకాల మయ్యెను. రాచనగరిమోసాలమీది గడియారమున బదునాఱు గంటలు మ్రోగెను. మనకధా పాత్రములు పూతకూళ్ళింటికి భుజింపబోదలచిరి. ఏతత్కధా కల్పనాకాలము నాటికి గాకతీయ్ ప్రతాపరుద్రదేవుని రాచనగరు సమిధికప్రాభవముతో గలదనియు, దానిమోసాల మీద ఘటికాయంత్రము (గడియారము, నేటి స్విడ్జర్లండు