పుట:2015.333848.Kavi-Kokila.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ న కు మా రి

8

జనకుని నిర్యాణంబును
 మనమున దలపోసి మాటిమాటికి శోక
 మ్మున గృశియించెడు కన్యకు
 నను నయవాక్యములు పలుకు నాయువకుండున్.

కొన్నిదినంబులంగడిపి, కోమలి యమ్మల్లికమ్ముదీర్ప లొ
 కోన్నత వైభవంబు సరసోక్తుల బోధయొనర్చి, కొంత యా
 పన్నతవాసి, యంతిపురిపై బలుకోరిక లుప్పతిల్లు న
 ట్లెన్నియె వర్ణనల్సలుపు నింతిమనంబు కరంగు నట్లుగన్.

తరుణుడు పల్కెడు లౌకిక
 సరణులు చిత్రములుగాగ సకిమది దట్టన్
 విరచింపఖ్ంబడిన ఱాచి
 త్తరువొయన నిశ్చలముగదా వినుచుండున్.