ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి
8
జనకుని నిర్యాణంబును
మనమున దలపోసి మాటిమాటికి శోక
మ్మున గృశియించెడు కన్యకు
నను నయవాక్యములు పలుకు నాయువకుండున్.
కొన్నిదినంబులంగడిపి, కోమలి యమ్మల్లికమ్ముదీర్ప లొ
కోన్నత వైభవంబు సరసోక్తుల బోధయొనర్చి, కొంత యా
పన్నతవాసి, యంతిపురిపై బలుకోరిక లుప్పతిల్లు న
ట్లెన్నియె వర్ణనల్సలుపు నింతిమనంబు కరంగు నట్లుగన్.
తరుణుడు పల్కెడు లౌకిక
సరణులు చిత్రములుగాగ సకిమది దట్టన్
విరచింపఖ్ంబడిన ఱాచి
త్తరువొయన నిశ్చలముగదా వినుచుండున్.