పుట:2015.329863.Vallabaipatel.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

61

ననేక గ్రంథములు జైలులోనే వ్రాసినాఁడు. అజాద్‌కూడ కురూనుపై గొప్పవ్యాఖ్యానము జైలులోనే వ్రాసినాఁడు.

మన యాంధ్రదేశములోఁగూడ మాలపల్లి మున్నగు మహత్తర గ్రంథాలు కారాగృహములోనే రచింపఁబడినవి. నవ్యసాహిత్య మెంతో కటకటాలనుండియే బయలుదేరినది.

కార్యశూరుఁడని ప్రఖ్యాతిగాంచిన మన పటేలు లోగడ నెప్పుడును బుస్తకము పట్టువాఁడుకాఁడు. కాని యీ పర్యాయము చాల తీవ్రముగా గ్రంథపఠన చేసినాఁడు. సాహిత్యము, వేదాంతము, రాజకీయములు, ఆర్థికశాస్త్రము, వ్యాపారము మొదలగువానికిఁ జెందిన గ్రంథములను 300 వఱకుఁ బఠించెను. వెల్సు, బెర్‌నార్డుషా, టాగూర్, రస్సెల్, కారల్ మార్క్సు, ఏంజిల్ ప్రభృతుల గ్రంథములన్నిటిని గాలించినాఁడు. అన్నిటికంటె నిదొక గొప్ప విశేషము.

ఇట్లే పెక్కు విధములఁ దమ కాలము నానందముగాఁ గ్రంథావలోకనముతో గడపిన మన ప్రముఖులు మూడు సంవత్సరముల యనంతరము 1945 జూన్, 15 వ తేదీన మన మధ్యకు వచ్చిరి.

సర్దార్‌జీ జన్మదినోత్సవములు

సర్దార్‌పటేలు కాడంబరములన్నను నట్టహాసములన్నను గిట్టవు. అందుచే నంతకుముందు బటేలు జన్మదినోత్సవములు చాలవఱకు నిరాడంబరముగానే జరిగినవి. కాని 70, 74 వ జన్మదినోత్సవములుమాత్రము భారతప్రజ తమ 'కర్మవీరుని'యం