పుట:2015.329863.Vallabaipatel.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

వల్లభాయిపటేల్

నేమి, యాయన కాంగ్రెసు రాయబారిత్రయములో (నెహ్రూ, అజాద్) నొకఁడై కాంగ్రెసుప్రతిష్ఠకుఁ దగినట్లుగా నడపిన సంగతి సర్వజనవిదితము.

ఆయన కాంగ్రెసు వర్కింగుకమిటీ సభ్యుఁడేగాదు. కాంగ్రెసు సూత్రధారులలో నొకఁడేకాదు. గాంధీజీ తర్వాత కాంగ్రెసువిధాననిర్ణేతలలో నగ్రస్థానము వహించినవాఁడు.

అన్నదమ్ములు

కాంగ్రెసులోఁ బ్రఖ్యాతి గాంచిన నాయకులలో నన్నదమ్ములజంటలు కొన్నిగలవు. ఆలీసోదరులు, బోస్ సోదరులు, ఖాన్ సోదరులు, పటేల్ సోదరులు ప్రఖ్యాతులు.

ఆలీసోదరులలోఁ బెద్దన్నయ్యషౌకతాలీ భీమాకారుఁడు. ఆయన యాకారమే రాజద్రోహకర మైనదని యాయన యనుచుండెడివాఁడు. నిండుహృదయుఁడు. ఆయనతమ్ముఁడు మహమ్మదాలీ యఖండప్రతిభావంతుఁడు. ఆలీసోదరు లిరువురు మహాత్ముఁడు ఖిలాఫతుద్యమములో నేకీభవించిచేసిన స్నేహము ప్రచారము ప్రబోధము. చరిత్ర ప్రసిద్ధమైనవి. వారిరువురు వామనమూర్తియగు గాంధీమహాత్మున కంగరక్షకులై యను యాయులై, వర్తించిన విషయము విశదమే. అందులో మహమ్మదాలీ 1923లోఁ బ్రథమముగా నాంధ్రదేశమునఁ గాకినాడ కాంగ్రెసుసభ కధ్యక్షుఁడైనాఁడు. కాంగ్రెసధ్యక్షోపన్యాసములలోనికెల్ల నాయన యుపన్యాస మతిదీర్ఘమైనది. ఆ దీర్ఘ బాహువునకుఁ దగినట్లుగానే యది యున్నది.