పుట:2015.329863.Vallabaipatel.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

వల్లభాయిపటేల్

క్రిప్సు, సర్ అలగ్జాండర్, పెథిక్ లారెన్సు, అను అమాత్య త్రయమును భారతదేశమునకు రాయబారమంపిరి.

ఈ రాయబారపు సందర్భములో వల్లభాయి 1946 మార్చిలో బొంబాయిలో నిటులు ప్రసంగించెను.

"భారతదేశ మీ యేడు గడవకమునుపే స్వాతంత్ర్యము పొందఁగలదు. రాయబారమువచ్చిన బ్రిటిషు అమాత్యత్రయముతోఁ గాంగ్రెసు మైత్రితో మెలఁగును. పెక్కు మార్లు కాంగ్రెసు స్వాతంత్ర్య సంగ్రామము గావించినది. కాని ప్రస్తుతము మంత్రిత్రయముతోఁ జర్చించుట కే నిర్ణయించినది."

"ఈ చర్చలు విఫలమైనచోఁ గాంగ్రెసు తుదిసారి పోరాటము సాగించును. బ్రిటిషు ప్రభుత్వమువారు భారతదేశము నుండి నిర్గమించునట్లు పాటుపడును."

అమాత్యత్రయ మాసేతు హిమాచలము పర్యటన మొనరించి యొక పథకమును సూచించిరి. కాంగ్రెసువారు దాని కంగీకరించిరి. తదనుగుణముగ 1946 సెప్టెంబరు రెండవ తేదీన నెహ్రూ ప్రధానమంత్రిగాఁ దాత్కాలిక మంత్రివర్గ మేర్పడెను. ఆమంత్రివర్గమున వల్లభాయి హోంశాఖను, బ్రచురణశాఖను నిర్వహించెను. ముఁస్లింలీగు ప్రతినిధులు తొలుత నీ మంత్రివర్గమునఁ జేరకుండిరి. వైస్రాయికోరుటచే తర్వాత వారును బ్రవేశించిరి.