వెలుగోటి యాచమనాయఁడు
81
దయమీఱఁగా ధర్మదారపట్టించి
బంగారు బొమ్మను పాండ్యభూపాలుఁ
డింగితవేది యై యిచ్చిన మెచ్చి
తంజాపురము చేరి తనవంశవజ్ర
పంజరంబై సార్వభౌమ సామ్రాజ్య
లక్షణంబులతో కళావతి సతియు
కుక్షసంభవ రాజగోపాలుఁ డనఁగ
విజయసంధాయియై వెలయుడు నున్న
విజయరాఘవనామ విఖ్యాతిఁ గాంచి
యాముహూర్తమున బట్టాభిరామాభి
రామ మై మించు శ్రీరామసౌధమున
చలువరాజగతిపై జాళువాపసిఁడి
పలకలగొప్ప దప్పరములోఁ జేరి
పేరోలగంబున్న పెద్దమ్మవార
లారతు లెత్తినా రని వ్రాసి రాఁగ
కొలువులో చదివించికొని స్వామివారి
బలపౌరుషము లెంచి పాచ్ఛాపువారు
సమయోచితోక్తుల జాల లాలించి
తమముద్రచే కాగితము శిఖాచేసి
ఘనముగా మీ కుడుగరలు గట్టించి
హనుమోజిపంతుల నంపించినారు
యిటువలెనడచిన దిక్కడికార్య
మటు గాన నెఱిఁగుండవరించేది."