పుట:1857 ముస్లింలు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింలు

అండమాన్‌కు పంపబడిన తొలి తరం స్వాతంత్య్ర సమర యోధులలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉండటం భారతీయ ముస్లిం సమాజం గర్వించదగిన అంశం.

త్యాగాలొకరివి- భోగాలొకరివి

1857నాటి సంగ్రామంలో ప్రజల మధ్య పటిమైన ఐక్యత వ్యక్తమైనా, అందరూ ప్రాణాలకు తెగించి పోరాడినా భారతీయులు పరాజితులు కావటం వెనుక గల ప్రధాన కారణాలలో ఒకటి ఆనాటి సంస్థానాధీశులలో కొందారు విద్రోహానికి పాల్పడటం. పరాయి పాలకులతో ఒకవైపు పోరాటం సాగుతుంటే పోరాటయోధాులకు అండగా నిలవాల్సిన స్చదేశీపాలకులు కొందారు ఆంగ్లేయుల పక్షం వహించి స్చదేశీ పోరాట వీరులకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈ విధాంగా బ్రిటీషర్ల తొత్తులుగామారిన వారి వల్లే ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు విజయం దక్కింది.ఆ ద్రోహులే తమ విభీషణ చర్యల ద్వా రా స్వదేశీయులకు పరాజయం ఆంగ్లేయులకు విజయాన్నీ తెచ్చిపెట్టారు. ఈ విషయాన్ని ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఆంగేయాధికారులు,ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, 'తిరుగుబాటు'ను తమ పత్రికలకు రిపోర్టు చేయ డానికిఇండియాకు ప్రత్యేకంగా వచ్చిన పాత్రికేయులు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆనాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ If Scindia Joins the rebels, I will pick off tomorrow....The Princes acted as the break waters to the strom which otherwise would have swept us in one wave అని వాస్తవం పలికాడు. ( 'Untoldhistory of Freedom Struggle' by M.Burhanuddin Qasmi, The Milli Gazette, 16-31 May 2007 P. 4)

ఆనాి స్చదేశీపాలకులలో ప్రముఖులైన, కాశ్మీర్‌, హైదారాబాద్‌, గ్వాలియర్‌,నభా, కపుర్తలా, ఉదాయ పూర్‌, జైపూర్‌, ఆల్వార్‌, కోఠా, భోపాల్‌, పటౌడి, శిక్కు పాలకులు,మరాఠాలు, సింధియాలు, నేపాల్‌ సంస్థానాధీశులు, రాజస్థాని రాకుమారులు పెద్దసంఖ్యలో బ్రిటీష్‌ పాలకుల తొత్తులుగా మారారు. ఆ కారణం గా ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం సానుకూల ఫలితాలను సాధించలేకపోయింది.ప్రదమ స్వాతంత్య్రసంగ్రామ యోధులు నానాసాహెబ్‌ 1858లో తన గురువుకు రాసిన ఒక ఉత్తరంలో ఈ చేదు వాస్తవాన్ని ప్రస్తావిస్తూ ఈ పరాజయం కేవలం నాది మాత్రమేకాదు. సంపూర్ణ భారతదేశ పరాజయం. గూర్కాలు, సిక్కులు, దేశీ రాజసంస్థానాల

59