పుట:1857 ముస్లింలు.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఎత్తిపొడుపులను గమనిస్తే ప్రజల పట్టుదల, ఆగ్రహం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

(“ The aid of the Almighty and his prophet is present with Afzalud-Doula Bahadur who should not fear and be apprehensive. If fearful he should wear bangles and sit at home...If Afzal-ud-Doula does not act on this paper, another Soobah will be ready from Delhi...If after reading these papers on hearing of it a representation is not made to the king (Nizam) or his Diwan,....the oath of the swine is on him and if in case of a Hindu the oath of cow...if this paper removed from this place the curse of God and his prophet will rest on the person removing it...” - Highlights of the Freedom Movement in Andhra Pradesh - The Freedom Struggle In Hyderabad, Volume II (1857—1885) Govt. of A.P, 1956, P.8-9 )

ఈ ఆహ్వానాలు, ప్రజల విజ్ఞప్తులు నిజాం నవాబుకు ఏమాత్రం పట్టలేదు. బ్రిటిషర్లు మాత్రం ముంచుకొసున్న ప్రమాదాన్ని గ్రహంచారు. సంపన్నవంతమే కాకుండా ఓ బలమైన మద్దతుదారుడైన నిజాం తమకు దూరమైతే అంతా దూరం కాగలదని భయపడ్డారు. దక్షిణాది నుండి నిజాం కనుక తిరుగుబాటులో పాల్గొన్నట్టయితే తమ ఆధిపత్యం అంతం కాక తప్పదని భావించిన ఆంగ్లేయులు నిజాం జారిపోయినట్టయితే అంతా జారి పోయినట్లే అనే స్థిరాభిప్రాయానికి వచ్చారు. తిరుగుబాటు ప్రభావానికి, ప్రమాదానికి నిజాం సంస్థానం ఏమాత్రం గురికాకుండా ఉండేందుకు ఆంగ్లేయులు శాయశక్తులా కృషి చేశారు. చివరకు నిజాంను మంచి చేసు కుంటూ, ఆయనకు అంతులేని ఆశలు కల్పిస్తూ, బహుమతులు అందజేసుకుంటూ తిరుగుబాటుకు దూరంగా ఉంచగలిగారు.

తెల్లవారిని తరిమి...తరిమి కొట్టండి !

ఈ వాతావరణం నచ్చని నెజాం సంస్థానంలోని ప్రజలలో సహనం నశించింది. నవాబు మీద గౌరవంతో తిరుగుబాటుకు ముందుకు రావాల్సిందిగానూ, ఆంగ్లేయుల పెత్తనం నుండి విముక్తం కావాల్సిందిగానూ ఆహ్వానం పలికిన స్వాతంత్య్ర కాంక్షాపరులు అది సానుకూలం కాకపోవడంతో తమ ఆగ్రహాన్ని తెల్లవారి మీదకు మళ్ళించారు. ఆ ఆగ్రహజ్వాలల నుండి తెలవార్ని తరిమి కొట్టమని, మట్టుబెట్టమని ప్రజల నుండి నినాదాలు


144