Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

కాళిదాస చరిత్ర

రాజు కవులను నా యాస్థానమునకుఁ దీసికొనిరారేమని మరల నడుగుచున్నాఁడుగదా?ఈ నిర్భాగ్యునిఁ దీసికొనిపోయితిమా వీని కవిత్వము విని యసహ్యపడి లోకమునం దందఱు నిట్టిమూర్ఖులే యని తలంచి క్రొత్తకవులను దీసికొనిరమ్మనఁడు-మనము జీవించియున్నంతకాలము మనయందు గౌరవ మట్లేయుండును" అని తలపోసి సంతుష్టాంతరంగులై మఱునాఁడుదయమున రాజాస్థానమునకుఁ బోయిరి. కాళిదాసుఁడు ప్రాతశాలువాయొకటి తలకుఁజుట్టుకొని నిరాడంబరవేషముతో రాజసభఁ బ్రవేశించి నొకమూల నొదిగి కూర్చుండెను. కవిత్రయములో మొట్టమొదటివాఁడు కాళిదాసును మహీపాలునికిఁజూపి "ఇతఁడు గౌడదేశీయుఁడు. పండితకవి. దేవరవారిమీఁద రసవంతమైన కవిత్వము చెప్పినాఁడట సావధానచిత్తులరై వినవలయు" నని చెప్పెను. "రచియించిన శ్లోక మొకటి చదువు" మని మహారా జానతిచ్చెను. అప్పుడు కాళిదాసుఁడు తాను వెనుకటిదినమునఁ గవులయెదుట జెప్పిన వెఱ్ఱిమొఱ్ఱి శ్లోకముఁ జదువక కవిత్రయ ములికిపడునట్లు, సభాసదులాశ్చర్యపడునట్లు, భోజమహారాజ మనఃపుండరీకము వికసించునట్లు, నిరుపమానధారా పరిపూర్ణములై, కఠినాక్షర ద్విత్వాక్షర దుర్ఘట సమాసయుక్తములైన శ్లోకముల నీ క్రిందివిధమునఁ జదివెను.

శ్లో॥వాశ్చా రేద్ద్వజద గ్దృతోడ్వధిపతిః శుధ్రేడ్జజానిర్గణే
డ్గోరాదారుదురస్సరే డురుతరగ్రైవేయక భ్రాడరం
ఉడ్వీడ్ద్రఙ్నరకాస్ధిధృక్త్రిదృగిభే డార్ద్రాజినాచ్ఛాదన
సస్యా దంబును దంబుదాళిగళరు గ్దేవో ముదేవో మృడః

రెండవశ్లోకము—

శ్లో॥షడ్జా మడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధా డ్జాలాంశ్చమడ్ఖా ఖరే
   జడ్జట్కిట్కి ధరాడ్ధరేడ్ఫరే డ్ఫునఘనః ఖడ్జోతవీడ్యడ్ర్భమా