పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16

కాళిదాస చరిత్ర


వివాహము

ఆవనంబునకు

సమీపమున నొకదేశముకలదు. ఆదేశమునేలు రాజునకు సర్వాంగసుందరమైన సర్వమంగళ యను పుత్రిక కలదు. ఆమె యమేయ రూపలావణ్యసమేతమై తలిదండ్రులకేగాక బంధుమిత్రులకు, నగరవాసులకు నయనోత్సవము జేయుచుండెను. రూపమునకుదోడు వినయసంపత్తి కలదు. సకలశాస్త్రపారంగతుడైన యొకానొకబ్రాహ్మణుని రావించి యారాజు విద్యాబుద్దులు గఱపుమని తన గారాబుకూతును వాని కప్పగించెను. బాలిక మిక్కిలిశ్రద్దతోగ్రహించి గురుభక్తిగలిగి యయ్యవారు చెప్పినదంతయు సూక్ష్మబుద్దితో గ్రహించినదానిని మఱువక కుశాగ్రబుద్ధిశాలినియని పేరుదెచ్చుకొని క్రమక్రమముగ విద్యలన్నియు నేర్చుకొనెను. విద్యాపూర్తియైనపిదప రాజు గురువునకు గురుదక్షిణ నిమ్మని చీనిచీనాంబరములు వెలలేని యాభరణంబులు మొదలగునవి యిచ్చి గురువునకు సమర్పింపుమని పుత్రికనంపెను. గురువు వయోవృద్దుడయ్యు , జ్ఞానసంపన్నుడయ్యు, గుణహీనుడగుటచేత నాబాలికయొక్క నవయౌవనప్రాదుర్బావముంజూచి మోహ విష్టుడైపరవశత్వముజెంది బాలికతో నిట్లనియె—“లతాంగీ! నీగురుభక్తికిజాలమెచ్చితి నాకీయాభరణంబులేల? ఈకాంచనవస్త్రంబులేల? నీనిరుపమాన లావణ్య తారుణ్యంబుల జూచినది మొదలు నిన్నొక్కసారిబిగియాగు గౌగిటజేర్చి ముద్దాడవలెనని కోరిక పుట్టినది. నాయందునీకు నుజముగా భక్తికలదేని నాకోరికదీర్చుము. అదియే గురుభక్తి అదియే గురుదక్షిణ, అదియే శుశ్రూష“ యనిపలికి లేచి పయోముఖవిషకుంభమువంటి యా యుపాద్యాధముడు బాలిక హస్తము బట్టుకొనబోవ