పుట:హరివంశము.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462

హరివంశము

వ. అప్పరమేశ్వరు నైశ్వర్యంబులుం గార్యంబులు నాశ్చర్యంబు లగుట యుదా
     హరించి యవి ప్రసంగంబులుగా ని ట్లనిరి.313
క. దేవా దేవరబాంధవ, భావంబున మమ్ముఁ గలసి భవ్యక్రీడా
     ప్రావీణ్యమున నటించుట, నేవారలు లేరు తుల్యు లెందును మాకున్.314
మ. నిను నిత్యంబునుఁ గన్నులారఁ గనుటన్ నీవాక్యముల్ నిత్యముం
     దనియన్ వీనులఁ గ్రోలుటన్ భవదనుధ్యానంబు నిత్యంబు నె
     మ్మన మానందమయంబుగాఁ బడయుట న్మాపుట్టువుల్ దివ్యభా
     వనిరూఢంబుగఁ జేసె నిట్ల కరుణావ్యాసక్తిఁ బాటింపుమీ.315
వ. అని పలికి యమ్మహాత్ముచేత నభినందితు లై వారలు నిజగృహంబుల కరిగి సుఖంబున
     నుండిరి హరియును బూర్వప్రకారంబున విహరించె నంత.316
క. దేవకియును రోహిణియును, రేవతియును రుక్మిణియును బ్రియము లెసఁగ సం
     భావన లొనర్ప గారా, మై వెలసె బలీంద్రుపౌత్రి యదుతతి కెల్లన్.317
క. ప్రద్యుమ్నుదేవి కోడలి, హృద్యచరితమునకుఁ బ్రీతి యెలయఁ దమకులం
     బుద్యోతిత మగు నియ్యమ, యుద్యద్గుణసమితి నని ప్రియోత్కట యయ్యెన్.318
ఉ. ఆవనజాక్షిఁ జెంది సరసాభిమతోజ్జ్వలవస్తుజాతముల్
     కేవలయోగభాగ్యపరికీర్తిఁ దలిర్పఁగ వీతఖేద యై
     యౌవన ముల్లసిల్లఁ గరుణాభిమతుం డనిరుద్ధుఁ డుద్ధత
     శ్రీవిలసత్సుఖోన్నతులఁ జెందె నమందరసోదయాత్మతన్.319
వ. ఆ చిత్రరేఖయు సఖిసాంగత్యసంప్రమోదంబునం గతిపయదివసంబులు వసియించి
     యనంతరంబ యయ్యింతి వీడ్కొని తక్కిన చెలులకుం బ్రియపూర్వకంబుగా
     నెఱింగించి యప్సరోలోకంబున కరిగె నని చెప్పి వైశంపాయనుండు జనమే
     జయున కి ట్లనియె.320
క. నీ వడిగిన బాణకథా, శ్రీవిభవము విస్తరించి చెప్పితి నిమ్మై
     గోవిందుచరిత మతిసం, భావితము సమస్తభువనపావనము నృపా.321
ఉ. విష్ణుమూలతత్త్వమును వేమఱు[1] నయ్యయిజన్మకర్మవ
     ర్తిష్ణుత లాదరించుటలు దేవకికిన్ వసుదేవుకున్ ధరన్
     గృష్ణుఁ డనంగఁ బుట్టి శిశుఖేలన మాదిగఁ గల్గుభావముల్
     ధృష్ణుత నిర్వహించుటలుఁ దెల్లగ వింటి నరేంద్రపుంగవా.322
సీ. వినుము నారదముని చనుదెంచి సకలరాజన్యుల యెదుర నాశ్చర్యభూతుఁ
     డితఁ డని కృష్ణుని నుతియించు టాదిగా గోవిందుమాహాత్మ్యకోటి యెల్ల

  1. 'వనుదేవసూనుఁడై' అని వెనుకటి ముద్రణము.
    'వసుదేవుకున్' అని ప్రాచీనపాఠము.