ఉత్తరభాగము . ఆ. 8.
461
దేవుని ప్రార్థనం గరుణ దేవవిరోధికిఁ గేలుదోయితో
జీవిత మిచ్చె నేమి యని చెప్పుదు మివ్విభు దోర్విలాసముల్.306
వ. ఇమ్మహానుభావుండు మహీతలంబున నవతరించిన కార్యంబు జగద్ధితధుర్యం బై
పర్యాప్తం బొందె నేము విగతశోకుల మైతి మింకను నిమ్మహాబాహుబాహుల
ప్రాపు గలదు గావున నేవిధంబులయందును బరిస్పందంబు లేక నాకంబున సుఖిం
చెదము మీరు ద్వారకానగరసౌధోద్యానసరసీప్రముఖంబులు సుఖోచితస్థానం
బులుగా మనుష్యోచితపురుషాయుష్యం బంతయుం జింతం బొరయక నిర్వ
హించువా రని పలికి పాకశాసనుండు.307
ఉ. క్రమ్మఱఁ బంకజాక్షు నతిగాఢతరంబుగఁ గౌఁగిలించి హృ
ద్య మ్మగుభాషణమ్మునఁ బ్రియప్రవిపూరణ మాచరించి నె
య్య మ్మలరార వీడ్కొని సమస్తసురాసురసంయమీంద్రసం
ఘమ్ములు గొల్వ నేఁగె నవికల్పత నాత్మనివాసభూమికిన్.308
వ. ఇక్కడ గమలనాభుండు సభాసీనుం డై సర్వయాదవులం గుశలం బడిగి తన
పోయివచ్చిన వృత్తాంతం బంతయు సవిస్తరంబుగా వారల కెఱింగించి తదీయంబు
లగుప్రత్యభినందనవాక్యంబుల సవిశేషసంతోషంబు నొంది వినతాతనయు నభి
నందనపూర్వకంబుగా వీడ్కొలిపి నారదమునీంద్రు నమందమాధుర్యధుర్యంబు
లగు వచనచాతుర్యంబుల నుత్పాదితప్రమోదుం జేసి విజయం చేయుండని పనిచి.309
ఉ. ము న్ననిరుద్ధుఁ బాసి పతిమోహభరంబున స్రగ్గి యెంతయున్
విన్నఁదనంబునం బడినవీ డఖిలంబునకున్ మహోత్సవం
బెన్నఁడు నెందు నెవ్వరును నిట్టి దెఱుంగ రనంగఁ జేయుఁ డం
చున్నతి నానతిచ్చెఁ గురుసోదరబాంధవపౌరకోటికిన్.310
వ. అమ్మహోత్సవసమయంబున నుగ్రసేనాభ్యనుజ్ఞాపురస్సరంబుగా నతండు బాణ
తనయతోడం జనుదెంచిన చెలికత్తియలలోనం గుంభాండు కూతుఁ జిత్రరేఖ చెలి
యలి రామాభిధాన యగు కన్యక సాంబకుమారునకును సురాసురసిద్ధకన్యలం
బెక్కండ్రఁ దక్కిన కుమారులకును వివాహంబు సేసె నట్టి కల్యాణపరంపరయందు
గృహంబున నరనారీసముదయంబులకు ననేకచిత్రాలంకారవిరచనంబులు నభి
రామతూర్యనాదంబులు నవిశంకితప్రమోదనర్తనంబులుఁ బ్రవరిల్ల నఖిలగృహం
బులు నేకగృహంబు తెఱంగున శోభల్లె నంత.311
క. ఒకనాఁడు యదుప్రవరులు, సకలోత్సాహమునఁ గృష్ణుసదనమునకు ను
త్సుకతఁ జనుదెంచి సమ్మద, వికసితసంభాషణప్రవీణత యొప్పన్. 312