పుట:హరివంశము.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

433

వ. సభామండపంబునకుం జనుదెంచి యుగ్రసేనపురస్సరంబుగాఁ దగినతేఱంగున సకల
     యాదవులు నాసీనులుగా నాసీనుం డై యున్న సమయంబున.29

నారదమహాముని శ్రీకృష్ణునికి ననిరుద్ధుని వృత్తాంతంబంతయు నెఱింగించి పోవుట

క. ఉదయించినభానుఁడు గా, కుదయించెనొ కాక పేఱ యుష్ణకరుఁ డొకం
     డిది యద్భుత మనఁగా నా, రదముని కట్టెదురఁ దోఁచె రాజితలీలన్.30
వ. అంత నమ్మహాత్మునిఁ గనుంగొని కమలనయనుండు మున్నుగా నందఱు నభ్యు
     త్థితు లై జయజయ శబ్దంబులం బూజించిరి కృష్ణుండు మధుపర్కంబున నఖిల
     లోకార్చనీయు నతని నర్చించిన నతండు నర్హపీఠంబున నుండి యందఱ నెప్పటి
     యట్ల యుండం బనిచి యిది యేమీ యందఱుం జింతావికలంబు లైన య ట్లున్న
     భావంబులతోఁ బౌరుషంబులదెస నుదాసీనులుం బోలె నున్నా రనిన నారా
     యణుం డతనిం జూచి.31
క. మునివర యనిరుద్ధుం డెట, చనియెనొ యెఱుఁగంగ లేక సర్వదిశల నా
     తని వెదకించియుఁ గానక, మనములు నేడ్పడఁగ నిట్లు మఱిఁగెద మిచటన్.32
వ. త్రైలోక్యజంఘాలుండ వగు నీ విచ్చటికి విచ్చేయుట మాభాగ్యంబు గాదె
     కుమారునకు నింక నభ్యుదయంబ యనిన నవ్వుచు నవ్వి బుధసంయమి యి ట్లనియె.33
క. కన్నులకసివోఁ జూచితి, మెన్నఁడు నెచ్చోటఁ బోటు లిట్టు లెఱుఁగ మో
     యన్న భవత్పౌత్రుఁడొకఁడ, యున్నతభుజు బాణుఁ దొడరి యుక్కునఁ బెనఁగెన్.34
వ. ఎ ట్లనిన బాణదైత్యునికూఁతు రైన యుష యను కన్య యనిరుద్ధునిఁ గామిం
     చినం జిత్రరేఖ యను నచ్చర యచ్చెలవకై యిచ్చటకి వచ్చి యతనిం దోడ్కొని
     పోయి యిరువురం గూర్చిన నెఱింగి బాణాసురుండు కుమారుపైకి నడిచినం
     బొడిచి యతం డతనికి మిక్కుటం బగు మగంటిమి మెఱయుటయు.35
ఉ. లావున గెల్వలేక తనలావగుమాయ యొనర్చి సర్పరూ
     పావిలఘోరపాశముల నాతనిఁ గట్టెఁ బురందరద్విషుం
     డావిధ మెల్ల నేను దెలియం గని వచ్చితి నీకుఁ జెప్పఁగాఁ
     జేవ యెలర్ప లె మ్మఖిలజిష్ణు జయింపు బలీంద్రనందనున్.36
వ. బాణనివాసం బగు శోణపురంబునఁ బ్రద్యుమ్నసూనుం డున్నవాఁ డది యిచ్చ
     టికిఁ బదునొకండువేల యోజనంబుల దవ్వు గలదు మానుషంబున నధిగమింప
     నశక్యంబు.37
క. తలఁపుము వినతాసుతు న, బ్బలియుండు మనోజవుండు ప్రతిహతి లేదె
     వ్వలన నతనిగతి కేటికి, నలఘుమతీ యింకఁ దడయ నని పలికి తగన్.38
వ. నారదుం డరిగిన నాక్షణంబ పుండరీకాక్షుండు తార్క్ష్యుఁ దలంప నయ్యకంపిత
     ప్రభావు భావం బెఱింగి యెఱకల మెఱుంగులు దుఱంగలిగొనం జనుదెంచి
     భుజంగమథనుండు భుజంగశయను కట్టెదురం బ్రాంజలి యై నిలిచి ప్రణత
     మస్తకుం డై ప్రశస్తపర్ణస్వరమనోహరంబుగా ని ట్లనియె.39