పుట:హరివంశము.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

392

హరివంశము

తే. స్వామి యేతెంచుటయుఁ దదాజ్ఞసమర్థధ, కరణ మిట్లు నివేదింపఁ గలిగె మనకు
     ధన్యచరితుల మైతి మనన్యసులభ, మెందుఁ జూచిన సామాన్యమే గణింప.196
వ. అని సరససంభాషణపరితోషణంబులం బొంగు నంతరంగంబులతోడ నున్న సమ
     యంబున.197
క. ఇదె సనుదెంచె మురాంతకుఁ, డెదురుకొనుఁడు సకలజగదధీశు నతని నిం
     పొదవఁ గనుఁడు గన్నారఁగ, యదువరు ననుపలుకు లెసఁగె నంబరవీధిన్.198
వ. చారణప్రయుక్త యైనయయ్యుత్సవోక్తికి నుద్యుక్తు లై సర్వయాదవులును
     సర్వాలంకారకల్యాణవేషంబులతో సర్వపౌరసై న్యపురస్సరంబుగాఁ బురంబు
     వెలువడి రంత నంతరిక్షంబున దార్క్ష్యస్కంధాసనాసీనుం డై దేవకీసూనుండు
     గానంబడియె న ట్లరుగుదెంచి యతండు.199
క. వాహనము డిగ్గి దారుక, వాహిత మగునరద మెక్కి వరబంధుజన
     వ్యూహము లభినందింపఁగ, మోహమతిఁ బురప్రవేశముం బొనరించెన్.200
తే. నగరిలోనికిఁ జని రౌప్యనగమునందు, నగసుతాధీశ్వరుం డర్చనంబుసేఁత
     యతనిఁ గనుట భాషించుట యఖిలమునుప, మాదరంబున వినిపించె నర్హతతికి.201
వ. ద్వాదశవత్సరంబులు తన్నుం బాసి ముచ్చిరి యున్న బంధుమిత్రభృత్యకోటి
     నెల్లను బహుళవాక్యామృతప్రవాహంబునం దేల్చి పౌండ్రావరోధప్రకారం
     బును వార లెఱింగింప నెఱింగినవాఁ డై యుద్ధవోగ్రసేనబలదేవులఁ బ్రశంసించి
     సాత్యకి నెంతయు నుపలాలించి లీలాలోలవిభూషితవదనసరోరుహుం డై.202
శా. ఏమీ పౌండ్రుఁడు దానుఁ జుట్టములు నై యేతెంచెనే మేలు మే
     లేమైఁ దన్ను వధించుసేఁత కొఱకుం బ్రేరేచువాఁ డబ్బెనే
     నేమిం బూనికి లేకయుంటిని నిజం బిం కూర కె ట్లుండుదున్
     భౌమధ్వంసము పిమ్మటం బ్రథనలిప్సం గూడె నాకైదువుల్.203
క. భయ మొకటి లేక కుకురా, న్వయుల నగరిమీఁద [1]వచ్చినట్టిదురాత్మున్
     రయమున నేనును బలసం, చయములతో నరిగి ముట్టి చంపుదుఁ బోరన్.204
వ. అని పలికి పగతుపోయిన తెరువును దత్సన్నాహంబును నరయఁ దగినమానుసులం
     బుచ్చి సంస్మరణసమకాలంబునన చనుదెంచువానిఁగా వైనతేయు వీడ్కొల్పి సము
     చితవ్యాపారంబుల నున్నంత నట పౌండ్రుండు వారణాసీపురంబున నుండి చారుల
     వలన వనజనయనురాక విని కాశిరాజునుం దానును దక్కిన భూపతులు నాలో
     చనంబు సేసి యొకదూత నాదైత్యదమనుపాలికిం బుత్తెంచిన.205
క. పేరోలగమున వాఁడును, నారాయణుఁ గాంచి పౌండ్రనరపతి నన్నుం
     గోరి భవదంతికమున కు, దారతఁ బుత్తెంచె వినుము తద్వచనంబుల్.206

  1. బంచి