పుట:హరివంశము.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

363

     త్త్వనికాయంబులలోన నేమిపనికై వర్తిల్లె దుత్ఫుల్లలో
     చనుఁ డావిష్ణునిమూర్తితో నెనయు నీసన్తూర్తి యూహింపఁగన్.176
క. దేవుఁడవో దనుజుఁడనో, దేవేంద్రప్రముఖముఖ్యదిగధీశులలో
     నీ నొకఁడవొ పరమధ్యా, నావేశితచిత్తుఁ డున్నయట్లై తరయన్.177
వ. ఇంతయు నెఱింగింపు మని యడిగిన నప్పిశాచనాయకులం గనుంగొని యా
     జగన్నాయకుండు.178
తే. క్షత్రియుఁడ నేను యదువంశసంభవుండ, దుష్టమర్దనసుజనసంతోషణముల
యందుఁ జాలెడువాఁడ ఫాలాక్షుఁ గాన, నరుగుచున్నాఁడఁ గైలాసగిరికి నిపుడు.179
వ. ఇది నాతెఱంగు మీ రెవ్వ రివ్వనంబు సాధు లగుతపోధనులకు నియతనివాసం
     బాసురచరితులకు జొరఁదగినయది దిందుల మృగంబులును హింసకు
     విషయంబులు గావు ఘోరం బగుమాంసాహారంబులు మరిగి శునకసంబాధం బగు
     మృగయానురోధంబున మెలంగెడుమిమ్ము నేను సైరింప ననిన నద్దేవువచనంబులు
     విని యయ్యిరువురయందు నుత్తుంగదేహుండును దీర్ఘబాహుండు నగువాఁ డొ
     క్కరుం డి ట్లనియె.180
తే. ఆదిదేవు జగన్నాథు నచలు విష్ణుఁ, గృష్ణు నతిభ క్తిఁ దొలుత సంకీర్తనమునఁ
     దెలచి నీవు న న్నడిగినతెఱఁగు దెలియ, వినుము సెప్పెద నవధానవృత్తితోడ.181
వ. ఏను ఘంటాకర్ణుం డనుపిశాచనాయకుండఁ గుబేరకింకరుండ భయంకరకృత్యం
     బుల మృత్యువున కెనయగుదు నీతండు నాయనుజుండు మత్సమానవీర్యుం డవా
     ర్యం బగునిమ్మహాసైన్యం బస్మదీయం బిప్పుడు ప్రవర్తిల్లెడు మృగయావిహారం
     బును విష్ణుపూజాప్రకారంబ కా సమర్పింతుఁ గావున దీని హింస యన రాదు
     మఱియు నొక్కటి గల దెయ్యది యనిన.182
మ. చరమాంభోధితరంగముల్ దనమహాసాలాంఘ్రిమూలంబు వి
     స్ఫురదమ్లాననవీనఫేనకుసుమంబు [1]ల్సేర్చి యర్చింపఁగా
     నరుదై ద్వారవతీసమాఖ్య నఖిలవ్యాఖ్యాతమై యొప్పున
     ప్పురి మత్స్వామినివాస మప్పురి మహిన్ భూషించు నత్యున్నతిన్.183
క. అం దున్నవాఁడు నిత్యా, నందుఁడు వసుదేవుకూర్మినందనుఁడు మహా
     నందకహస్తుఁడు ద్రిజగ, చ్ఛందుండు ముకుందుఁ డార్తశరణుం డెందున్.184
మ. భువనోత్పాదనరక్షణప్రశమనంబుల్ సంతతస్ఫూర్తి నా
     త్మవిధేయంబులు గావునన్ సురపరిత్రాణార్థమై వచ్చి యా
     దవుఁ డైనాఁ డతనిన్ వినమ్రవరున్ దర్శింపఁగాఁ గోరి యు
     త్సవకల్పంబుగ నిందఱం గొని సముత్సాహంబుతో నేఁగెదన్.185
మ. అజుఁ బుట్టించి తదీయవిద్య యు నదాద్యం బైనయామ్నాయముల్
     నిజరూపం బెఱిఁగించి యిచ్చి మఖముల్ నిర్మించి తద్ధర్మముల్

  1. ల్దెచ్చి