ఉత్తరభాగము - ఆ. 1.
249
గించుచు నధికభయదసంరంభంబున విజృంభించె నంత నెల్లదెసలను దందహ్యమా
నంబు లగు వివిధజీవంబుల యాక్రోశనాదంబులుం బగిలి కూలుగండశైలంబుల
చండధ్వనులు నార్ద్రశుష్కదారుగుల్మావలీవేణువలయంబుల చూత్కారచిమచి
మాయితచ్ఛటచ్ఛటారావంబులు నుద్దామదాహదుర్లలితం బగు దహను పేర్మికిం
జెలంగి యార్చుమహీశ్వరమహావ్యూహంబుల యుత్సాహకోలాహలంబు
నూర్ధ్వాండంబులు నిండి యొండొండ సమస్తభువనరాసులకు సంత్రాసంబు
పుట్టించె నాసమయంబున.90
ఆ. కాననంబు లెల్లఁ గాలిన ననిమిషేం, ద్రాస్త్రవహ్ని నెఱక లంతవట్టు
మాఁడి మ్రోడువడినమాడ్కి [1]రూపఱెను గో, మంతపర్వతంబు మనుజనాథ. 91
క. పాతాళమునకు డిగి యీ, యాతతశైలంబు వ్రేళ్లు లన్నియు భస్మీ
భూతములు సేయ కుడుగునె, యీత వ్రాగ్ని యని తలఁకి రెడఁదల సురలున్. 92
వ. అమ్మహాదహను దరికొల్పి దాహభయంబునం బార్థివబలంబు లన్నియు నర్థ
క్రోశం బపక్రాంతంబులై చూచుచుండె నట్టియుపప్లవం బాలోకించి నీలాంబరుం
డంబుజోదరున కి ట్లనియె.93
సీ. మాధవ చూచితే మనకారణంబున నిన్నగేంద్రున కెంత యెగ్గు వుట్టె
గిరి కైనయాపద పరిహరింపఁగ లేక యివ్విధంబున నీవు నేను నూర
కుండితి మేని నిం కొండెద్ది గల దింతకంటెను నపకీర్తికరము ధరణిఁ
గానఁ బరార్థదుఃఖక్షముఁ డున్నతిశాలి యిమ్మహనీయశైలపతికి
ఆ. ఋణము నీగుపొంటె నిప్పుడ యీజరా, సంధుఁ గిట్టి పట్టి సమదబాహు
బల మెలర్పఁ గష్టపఱిచెద నీకు మె, చ్చుగ నొనర్చువాఁడఁ జూడు నన్ను.94
మ. అనలం బిట్లు తగిల్చి తారు సమరప్రారంభసన్నాహులై
జననాథుల్ బహుదేశవాసులు మహాసైన్యావళీకల్పనం
బొనరం బేర్చినవారు నేఁడ విను మీయుర్వీతలం బెల్ల ని
ర్మనుజేంద్రంబుగఁ జేయ కెట్లుడుగు నస్మత్కోపసంరంభముల్ .95
శ్రీకృష్ణబలరాములు గోమంతమునుండి సైన్యమధ్యంబునకు లంఘించుట
వ. అని పలికి యాక్షణంబ యాక్షిప్తమణికుండలుండును నాకంపితమణికిరీటుండును
నాందోళితనీలాంబరుండును నాలోలవనమాలావలయుండును నగుచు వాసు
దేవాగ్రజుం డన్నగాగ్రంబుననుండి రాజన్యమధ్యంబునకు లంఘించినం దోడన
చూడారత్నరోచులు సెదరం బీతవాసోంచలంబు చలింప శ్రీవత్సలాంఛనశ్యామి
కలు గడలొత్త నుదాత్త[2]స్మితమరీచు లుల్లసిల్ల నుత్ఫుల్లకమలనయనుం డగుచుఁ
గమలనాభుండు నుఱికె నయ్యిద్దఱ బెట్టిదంపుఁ ద్రొక్కునం గ్రుంగఁబడి గోమంత