పుట:హరివంశము.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

హరివంశము


వ.

ఇట్లు మాయావృషభంబు లక్కుమారశార్దూలంబుచేత నాలంబునం గూలిన నఖిల
గోపాలురు విస్మయంబు నొందిరి నందగోపయశోద లానందంబునం బఱతెంచి
నందనుం గౌఁగిలించి దీవించి రప్పుడు కుంభకుండు.

169


ఉ.

కన్నియచేయి చేతఁ గొని కౌతుకవేషమనోజ్ఞుఁ డైనయా
వెన్నునిఁ జేరఁ దెచ్చి యిది వీర భవద్భుజవీర్య[1]శుల్కయై
మిన్నక కాదు నీదయినమేనమఱందలు నీక చేరె నీ
కన్నెఁ బరిగ్రహింపు మని కాంతకరంబుఁ గరంబుఁ జేర్చినన్.

170


వ.

అమ్మహాతుం డమ్మహిళారత్నంబు గైకొనియె నప్పు డవ్వైదేహుండు వైదేహీ
వరణవిభాసి యగుచాశరథింబోలె నీళాస్వీకరణమహితుం డయిన మాధవు ననే
కాభరణాంబరాదుల నర్చించి యశోదానందగోపులకుఁ గట్ట నిచ్చి తక్కిన గోప
కుమారుల సంభావించె ననంతరంబ నెయ్యం బెసంగ వియ్యంబున కి ట్లనియె.

171


ఉ.

నీకొడు కప్రతర్క్య[2]మహనీయభుజావిభవుండు వీనిశౌ
ర్యాకలనంబుపేర్మి మము నస్మదశేషకులాన్వితంబుగా
శోకమువాపి మాన్చె నతిసుస్థిరజీవన మేను గంటి న
స్తోకవిభూతి నెంతయు యశోగరిమంబును బేర్చు నెల్లెడన్.

172


క.

వేలు పదివేలు లక్షలు, నీలకు నరణంబు గాఁగ నీయింటికి నే
మేలుగ నిచ్చెద గోవుల, నేలా యివి యనకు మిది యభీష్టము నాకున్.

173


వ.

అనిన నతం డతనిం జూచి నాకుం గొలందియిడరాని పసియను నపరిమితమహి
ష్యజావికంబులుం గలవు కృష్ణుండు జన్మించినదియాదిగా గోవులు ప్రతిసంవత్స
రంబును బ్రసూత లై కేపులు పురణించి వచ్చుఁ బా లెన్ని పితికితి మంతయు
ఘృతంబయి పేర్చు నరణ్యంబున గుల్మద్రుమాదులయం దెల్లను బహులం బగు
మధువులు సులభంబు లై యొదవు నెల్లవారికి నాయురారోగ్యంబును భోగ్య
వస్తుసిద్ధియును నవ్యాహతంబులు గొఱంత యెందును లేదు నీయిచ్చిన ధనం
బులు మాకు వచ్చినయవి యని పలికి యాదివసంబు పరమకల్యాణంబుగా
నక్కడ నుండి మఱునాఁ డతని వీడ్కొని కదలెఁ గృష్ణుండును నీళాసమన్వి
తుం డై శ్రీథాముం దనకుఁ బ్రియసఖుంగా నడిగి తోడ్కొని యశోదానంద
గోపు లభినందింప మగుడి యాత్మీయదేశంబున కరుగురించి తొల్లింటియట్ల
సుఖంబుండె నని చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

174


శా.

గోపాలత్వముఁ బొంది యవ్విదమునన్ గోవిందుఁ డున్నట్టి స
ద్వ్యాపారంబులు సెప్పఁగా శ్రుతికి నింపై యింత యొప్పారునే
యాపుణ్యాకృతి నాఁటివారలకు నెట్లై యొప్పేనో చూడ్కికిన్
రూపింప న్మదిలోన నిప్పుడును దా రోచిష్ణువై చెందెడున్.

175
  1. శుల్కయే
  2. భజనీయ్య మహా