పుట:హరివంశము.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 6

145


ఫలియించుఁ దత్ఫలంబు లయ్యాసురంబగుపశుగణంబు భక్షించుచుండు నని
కల దిప్పు డవ్విధం బంతయు సంపన్నం బైనయది.

67


ఉ.

ఆవిషవృక్షగంధము రయం బెసకం బయిఁ బాఱుతేర నా
నావిధరోగబాధలు జనంబులకున్ జనియించె నిత్తఱిన్
గోవులు గోపులుం దెవులుగొంటకుఁ గారణ మవ్విధంబు త
ద్భావితమై సరిజ్జలముఁ బ్రస్ఫుటదోషముఁ బొందె నెంతయున్.

68


వ.

దీనిం బరిహరించి దూరం బరిగిన వారి కారోగ్యం బగు వ్రేపల్లె తత్సమీపం
బున నున్నకతంబున నింత పుట్టె నందగోపసూనుం డగుకృష్ణుండును బలదేవుం
డునుం దాను నవ్విషభూజంబు భంజింప నోపు నతం డప్పని కియ్యకొనిన
నందఱు బ్రతుకుదు రని పరమేశ్వరుం డనుగ్రహించె నేను బోయెద నని పలికి
భూతంబు విడిచి పోయిన.

69


క.

ధరణీదేవుఁడు తెలివిం, బొరసె నఖిలభూమిసురులు బొంగుచు భూతే
శ్వరు వినుతించి సమాప్తిం, చిరి తత్క్రియ గోపవరులు చె న్నెసలారన్.

70


వ.

రామకృష్ణుల రావించి యవ్విధం బెఱింగించిన నగ్గుణగరిష్ఠులు బలిష్ఠులు గావున
నిశ్చితంబు లగునంతఃకరణంబులతో నందఱం గలయం గనుంగొని.

71


తే.

దేవదేవుని శాసనం బీవిధంబు, తల్లిదండ్రులు గులమును నెల్లవారు
బ్రతుకు తెరువది సద్యశఃప్రదమునట్టె, యింతకంటెను మేలు మా కెన్నఁడొదవు.

72


వ.

అని రపుడు కృష్ణుండు వారితోడ.

73


శా.

అంభోధిం బ్రభవించి విశ్వమును సంహారంబు నొందింప సం
రంభోజ్జృంభిత మైనయాద్యవిషమున్ రౌద్రప్రభావంబుతో
శంభుం డె ట్లుపసంహరించె విషవృక్షస్ఫూర్తియుం గీర్తితా
రంభప్రౌఢత నట్ల యే నుడిపెదన్ రాగిల్లుఁ డీరందఱున్.

74


వ.

అని పలికి యమ్మహాబ్రాహ్మణవర్గంబునకు నమస్కరించి శంకరునకు సాష్టాంగ
దండ ప్రణామం బాచరించి శివాలయంబునకు బ్రదక్షిణించి దేవకీసూనుండు
రౌహిణేయుదిక్కు చూచిన నతండును నట్ల చేసి యతనితో నేకకార్యుం డై
కడంగె నయ్యిరువురుఁ గట్టాయితం బై చేతులం గత్తులు గుదియలు గొడ్డండ్లునుం
గొని యాయతం బగునవ్విషవనంబున దెసకు నడచిన.

75


మ.

హరపూజాసుకృతంబుపేర్మి వెసఁ బ్రాప్తారోగ్యు లై గోపకుల్
పరమోత్సాహముతోడ బాహుబల మొప్పన్ సింహనాదంబు లం
బరభూమ్యుంతరపూరకంబులుగఁ దత్పార్శ్వంబులన్ ముందటం
ద్వరితాక్రాంతి యెలర్పఁగా నడచి రుద్యత్సాధనోపేతు లై.

76


వ.

బ్రాహ్మణపుంగవులునుం గోపాలసహితులై కుతూహలంబున వారిపిఱందన యరిగి
రిట్లు [1]సని కృష్ణుం డక్కాఱడవి మునుకొని కొంతదవ్వు గడచి.

77
  1. వెదకుచుం గొంత