పుట:హరివంశము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ 5

113


వ.

ప్రసన్నుండ వగు మనిన నే నతనిం జూచి లోకహితార్థంబుగా నూహించి చేసిన
కార్యం బపోహంబు నొంద నేర దీవు పరమపవిత్రం బగుభరతవంశంబున జని
యించి యీజాహ్నవియంద వసిష్ఠశాషదగ్ధు లై వచ్చిన వసువుల నుత్పాదించి
మఱియు సత్యవతి యనుపుణ్యవతియందు వంశకరు లగుకొడుకుల నిరువురం
గని క్రమ్మఱ నిజప్రకృతిం బొందఁగలవాడ వని విషాదంబు మాన్చితి నట్టిశంత
నునకుం బుత్రుం డైనవిచిత్రవీర్యునకు ధృతరాష్ట్రపాండుభూపతు లుద్భవించె
దరు వారిలోన.

44


తే.

పెద్దవానికి నూర్వురుఁ బిన్నవాని, కేవురును బుట్టుదురు సుతు లిద్ధతేజు
లట్టి యిరుదెఱఁగులకు రాజ్యాభిలాష, కలితమై పేర్చు నొకమహాకలహ మపుడు.

45


క.

ఘోరయుగాంతాకృతి యగు, నారణమున నుర్విఁ గలజనాధిపు లెల్లన్
వారికిఁ దోడై వచ్చి మ, హారోషత మ్రగ్గి పోదు రన్యోన్యహతిన్.

46


ఉ.

పీనుఁగుపెంటలై యొకటి [1]పేరును నెందును లేక యుండున
బ్లేనుఁగులున్ హయంబులు సమిద్ధజనావళియుం బడంగ ని
ర్మానుషరాష్ట్రదుర్గనగరప్రజయై తనభారమంతయున్
మాని సుఖించు నివ్వసుధ మానుఁ దృతీయయుగంబు నంతటన్.

47


వ.

కావునం గలహశీలుం డగుకలియంశంబు ధృతరాష్ట్రకళత్రంబునందును సర్వ
ప్రేరకుం డైనకృతాంతునంశంబు పాండురాజపత్నియందును జనించుఁ దక్కిన
వారియంశంబులు నుచితస్థానంబులం బ్రభవించు నని పలికినం బరమేష్ఠిపనుపు
నకు సర్వదివిజసమాజంబును నభినందించి యి ట్లున్న సమయంబున.

48

నారదుండు విష్ణునితోఁ గాలనేమి కంసుం డై పుట్టినతెఱం గెఱింగించుట

శా.

త్రైలోక్యాతిథియై విశృంఖలవిత్రప్రౌఢి నెల్లప్పుడుం
గేళిం గ్రుమ్మరు యోగసిద్ధుఁ డఖిలక్షేమంకరప్రజ్ఞుఁ డు
న్మీలన్మూర్తి వికాసనిర్జితశరన్మేఘుం డమోఘార్థవా
గ్జాలుం డబ్జజసూతి యైనముని వేడ్కన్ వచ్చె నచ్చోటికిన్.

49


క.

వచ్చి సభయెల్లఁ దనదెస, మెచ్చి కనుంగొనఁగ హరిసమీపంబునఁ బెం
పచ్చుగ నాసీనుం డై, యిచ్చ యెఱిఁగి వినయసముపహితవైదగ్ధిన్.

50


సీ.

మందారతరుపుష్పమంజరిమండితమస్తక యై యొప్పుమహితవీణ
ప్రసరించి త్రిస్థానబంధుస్థితిభేదములతోడ షడ్జంబు మొదలు గాఁగ
సప్తస్వరంబులు సారణావధి నభినవ్యక్తమూర్ఛనలతో నతిశయిల్ల
వాయించి [2]మధురదివ్యధ్వని మెఱయఁ జిత్రప్రబంధోజ్జ్వలతానరచనఁ


తే.

బూర్వభువనరక్షణము లాభోగములుగ, నద్భుతావతారంబు లింపారఁ బాడి
యఖిలలోకశరణ్యు దేవాదిదేవు, విష్ణు నలరించె సభ్యులు వేడ్క నలర.

51
  1. పేరునకైనను
  2. కొలిచి