పుట:హరవిలాసము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

శ్లో. ఇదమన్ధం తమః కృత్స్నం జాయేత భువనత్రయమ్,
   యది శబ్దాహ్వయం జ్యోతిరాసంసారం న దీప్యతే.

అజ్ఞానగాఢాంధతమఃపటలంబుఁ బటాపంచలుసేసి ముల్లోకంబులందు విశుద్దదివ్యజ్ఞాన తేజఃపుంజంబు వెలయించి సకలపదార్ధస్వరూపంబు నిరూపింప నసాధారణం బగుసాధనంబు శబ్దజ్యోతి.

ఇయ్యది నిత్య మై దోషరహిత మై పరమానందరసైకాస్పద మై పరబ్రహాత్మకం బనఁదగి యున్నది.

ఋగాదిచతుర్వేదంబులును, శిక్షాదిషడంగంబులును, మన్వాద్యష్ఠాదశస్మృతులును, శాతాతపాద్యష్టాదశాగమములును, విష్ణ్వాద్యష్టాదశపురాణములును, వాయవ్యాద్యష్టాదశోపపురాణములును, భాష్యాదిషడ్దర్శనంబులును, భారతాదీతిహాసంబులును, దక్కుంగలసకలశాస్త్రంబులు నీశబ్దబ్రహ్మముదివ్యావతారంబులు. ఈ శబ్దబ్రహ్మము నుపాసించియే మనపూర్వాచార్యు లగువ్యాసపరాశరాది మహర్షిసత్తములు దివ్యానందరసైకాశ్రయం బగు మోక్షమార్గము నెఱింగి కృతకృత్యులైరి.

ఇట్టి పరమోపకారకం బగుశబ్దం బిహపరసుఖానందకందం బని నొక్కి వక్కాణించుట సాహసంబు గాదు. కానిచో నీవృత్తతర్షులై యరణ్యంబుల వాతాంబుపర్ణాశను లగుమహర్షులుగూడ, శ్రీరామాయణాదిదివ్యప్రబంధంబుల రచించి రేయియుం బవలు నాశబ్దసుథాప్రవాహమధ్యంబున మునుఁగుచుం దేలుచు నేల యుందురు? దివ్యప్రబంధకవితామృతరసానుభవంబువలనఁ దాము నిత్యానందంబు నొందుటయెకాక భావివిబుధులు పఠితలును శ్రోతలును విషయవైలక్షణ్యము లెఱింగి యుత్కృష్టపదవి నొందుమార్గము గనుఁగొందురుగాత యనియె మహర్షుల ముఖ్యోద్దేశము.

అట్టిమహానుభావు లగుఋషిపుంగవులగ్రంథములు కేవలము భావగర్భములును, బరోక్షమోక్షానందమును బొందించునవియు నగు