పీఠిక.
ix
సీ. పంక్తికంఠునిమోహపరితాప మెంచెనే భువనమాత జగత్ప్రపూత సీత
యలపుళిందునిబొంద నాసక్తిఁ జెందెనే ప్రియహితామితనయభీమతనయ
నహషునివిరహంపుఁ దహతహ ల్చూచెనే సాంద్రసద్గుణచర్య యింద్రుభార్య
మఱి సింహబలునిపెన్మాయలఁ జిక్కెనే యారడి పనిఁబూని యాజ్ఞసేని
తే. మునుపటిపతివ్రతలు మహామూర్ఖచిత్తు
లైనదుర్జను లతిఘోరసూనసాయ
కాస్త్రజర్ఝరితాత్ము లై యాసపడిన
మాన ముడిపుచ్చుకొని రటే మచ్చకంటి. 127
చ. పతిహితభక్తిచే వెలయు పద్మదళప్రతిమాననేత్రకు౯
వ్రతములసోద లేటికి ధ్రువంబుగఁ బుణ్యము లబ్బు నెప్పుడుం
బతిని దిరస్కరించి పరభర్తలఁ జెందినభామపుణ్యముల్
గతజలసేతుబంధములు గావె వచింపఁగ నెంతనోచినన్. 123
అను నీ మొదలగుపద్యరత్నములను గ్రంథకర్త కూర్చి యీ గ్రంథము నలరారఁజేసి యున్నాఁడు. ఆమెచిత్తస్థితి నెఱింగి తగినయుపాయము నాలోచించి యెట్టులేని కాలము పుచ్చవలెనని యూహించియే
మ. ఆధిపుల్ క్రూరఫణిస్వరూపుల............లీడేర్చుకో. 135
అను మొదలగు మాటలు చెప్పి నాఁటిరేయి పుచ్చెను. మఱుదినము రాత్రి ఆమె యథాపూర్వముగ సింగారించుకొని రాఁగా నిఁక నీతులవలన లాభములేదని యుపాయము తెలిసినఁగాని యిప్పనిలో మెలఁగరా దనిచెప్పి య దెట్లని యామె ప్రశ్నించునట్లు చేసి యొకకథచెప్పి కథాంతమున నిట్టి యిక్కట్టున నెట్లు బొంకవలెనో తెల్పుమని యడిగి యామె చెప్పలేకపోఁగా తానే యాపద్దతిని జెప్పుచు నాటిరేయిని బుచ్చెను. అట్లే యిరువది దినములు గడిపెను. ఇందలి కథలన్నియు నొక దానికన్న నింకొకటి యుక్తిలో మించునట్లుండును. ఒకకథకన్న నింకొకకధలో నడిగిన ప్రశ్నమునకు సమాధానము చెప్పుటకు బుద్దిచమత్కార మెక్కువ కావలసియుండును. పోనుపోను కథలు మిగులఁ జమత్కృతి గలిగి చెన్నారుచుండును . ఇట్టు లిరువదిదినములు గడిపి హంస హేమావతిని దుర్వృత్తికి లోనుగాకుండఁ జేసెనని కవి గ్రంథరూపమునఁ దెలియఁజేసెను.
ఒక్కొక్కకథయు వ్యభిచారమునే బోధించుచున్నదే యెట్లిది నీతిబోధకమగు ననరాదు. హేమావతిదుర్వృత్తిని రూపుమాపుటకు నితరోపాయము సాధ్యముకాదు