పుట:హంసవింశతి.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

vii


మతినగుటచే నే నొక్కఁడనెకాదు నిష్పక్షపాతమతు లగుపెక్కుమంది యట్లనక తప్పదనియు నాభావము.

ఇందు హేమావతి యిరువదిదినములు భర్త దేశాంతరము పోయిన కారణముచేతను, హేల యను నొకదూతిక ప్రోత్సాహముచేయుట చేతను, జిత్రభోగుఁడను నాపురపాలకుఁ డైనరాజు నొద్దకుఁ బోవఁ బ్రయత్నింపఁగా నామె యింటనున్న హంస యాహేమావతి కేమోకథలు చెప్పి యాబుద్ధిమాన్పె నని చెప్పఁబడి యున్నది,

పరసంగమమునకై యువ్విళ్ళూరుచు నింటదండించుపెద్దలు లేక తానే యధికారముగలదిగా వున్న నవయువతికి నాబుద్ధిమాన్పుటకు వేదాంతవాక్యములు పనికివచ్చునో, ఆమెకు విన రుచించునట్లు అలాటి కథలనే చెప్పి, యట్టికృత్యములలో రాఁగల కష్టములందెల్పి, చిక్కులు సంభవించినపుడు తప్పించుకొనునంత శక్తి నీకుఁ గలదా యని ప్రశ్నించి, యామె చెప్పఁజాలక యూరకుండఁగాఁ దా నాయుక్తిని దెల్పి, నీకిట్టిశక్తికూడ లేదే యె ట్లిప్పనికిఁ బూనెద వని చీవాట్లుపెట్టి, యామె బుద్ధిని మరలించి సద్భుద్ధిని నెలకొల్పిన నామాటలుపనికి వచ్చునో, బుద్ధిమంతులే నిశ్చయింతురుగాక.

దుర్జనుని సజ్జనునిగాఁ జేయుటకు దండనముపనికిరాదు. సామోపాయ మావశ్యకము. శ్రోతకు హితముగా ముందు మాటలాడి, సమయోచితముగా నీతులునేర్పి, యతనిమార్గము తప్పుగా నున్నదని యతనికేతోఁచునట్లు చేసి క్రమముగా సజ్జనుల మార్గమునకు నతని దేవచ్చునే గాని గుబాలున నొక్క పెట్టున నీతివాక్యములు తాను జిన్నతనమున వల్లించినవి చదివి వెంటనే వానిని సజ్జనశిఖామణి జనకునిజనకునిగాఁ జేయ శక్యముగా దని నానమ్మకము.

మొత్తముమీఁద నట్టివిషయములు గలగ్రంథము తొలుదొల్త నీతిబాహ్య మనియే తోఁపకపోదు. అంతమాత్రముననే దానిని దూషింపఁగూడదు. అట్టి గ్రంధమునఁ జివఱకుఁ దేలునీతి యేమని విచారింపవలయు.

ఆనీతి చెడుత్రోవలఁ బోవఁ జూచునొక యన్నులమిన్నను సన్మార్గమునఁ బోవునట్లు చేయుట యని తేలినపుడు దానిని మెచ్చవలయునేకాని యందున్న కధాంతర్బూతములగు పద్యముల నాల్గింటిని వ్రాసిచూపి యిట్టియవినీతి బోధకపద్యములున్నవి గాన నీగ్రంథము దుర్ణయమును బోధించుననరాదు. ఈవిషయమై యీ గ్రంథమున నైదవ యాశ్వాసమునందు