పుట:హంసవింశతి.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

పీఠిక.


అని చెప్పుకొనుటంబట్టి పరికింపఁగా గ్రంథమును జెప్పి యితరులకుంజూపి వారిసంస్కరణముల నంగీకరించుకవి కాఁడనియుఁ బండితకవియనియు, శ్రీరామభక్తుఁడనియు స్పష్టము గాక మానదు. మఱియు భగవద్భక్తాగ్రగణ్యులనం బ్రఖ్యాతివహించినప్రహ్లాదాదిపరమభాగవతుల నిష్టదేవతాస్తుతిలోఁ జేర్చుటంజూడ నీమహాకవి భక్తఁడనుమాట దృఢపడకపోదు. ఈమహాకవి యీగ్రంథమున నింతకుముందు దానుఁ గ్రంథముల నొనరించినట్లు చెప్పుకొన కుండుటం జూడ నిదియే ప్రథమగ్రంథమని తేట పడుచున్నది.

ఆంజనేయశతకము తొలుత రచించి తరువాత హంసవింశతి నొనరించి యాపిదప దశావతారకథాసంగ్రహమును రచించినట్లు కొందఱు వ్రాసియున్నారు. కాని ఆంజనేయ శతకవిషయమిందు వ్రాసియుండక పోవుటచే నిర్ధారణముచేయ వీలులేదు. ఒకప్పు డది శతకమైనందున నీస్వల్పవిషయము నేల చెప్పు కొనవలయు నని యూరక విడిచియున్న నుండవచ్చును. దశావతారకథాసంగ్రహము నాచేతఁ బడలేదు కాన నావిషయమును నేను జర్చింపఁజాలకున్నాఁడను.

ఇఁక నీతఁ డేగ్రామమునఁ గాపురముండెనో యనువిషయము చర్చింపఁదగిన దైయున్నది. అయ్యలరాజురామభద్రమహాకవి ఒంటిమెట్ట యనంబడు నేకశిలానగర వాసియనుట సర్వజనాంగీకృత మగువిషయము. రామాభ్యుదయము రామభద్రవిరచితముగదా. అయ్యలరాజు, భాస్కరకవి యీయిరువురును రెట్టమతమును రచించినమహాకవులు. వీరు కర్నూలు మండలములోని యెఱ్ఱపాలెమునకు బాలకుఁ డయి, యహోబలక్షేత్రమునకు ధర్మకర్త యయిన వేంకటరాజునకు రెట్టమతగ్రంథము నంకితముచేసియన్నారు. కనుక వీరిరువురును గర్నూలుమండలములో నివసించువారే యనుట స్పష్టము. రాజాశ్రయమునకై యితరమండలములలోనున్నవారు రాఁగూడదా యన్నఁ బైవేంకటరాజు పాళెగాఁడే కాని గొప్పరాజ్యము కలవాఁడు కాఁడు. అట్టివానినాశ్రయించుట కెంతయో దూరమునుండి కవులు చనుదెంచి రన్నమాట విశ్వాసపాత్రము గాదు; ఆప్రాంతముల నివసించువారికి వారియందు విశ్వాసము గల్గియుండును గాన వారాశ్రయించియుండుట స్వభావము. కాఁబట్టి పైయిద్దరును గర్నూలుమండలవాసులో లేక యాచెంతనున్న కడపమండలవాసులో యై యుందురు. కడపమండలమున కహోబిలము మిగుల సమీపము.

ఈనారాయణకవి హంసవింశతిలోఁ బూర్వకవిస్తుతింజేయుచు

“ఉ. ఆయ్యలరాజు తిప్పసచివాగ్రణిఁ బర్వతరాజు రామభ
     ద్రయ్యను భాస్కరాగ్రణిఁ బ్రధానవరుండగుకొండధీరునిం