పుట:హంసవింశతి.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



పీఠిక.

అయ్యలరాజు నారాయణామాత్యకవి.

“నిందతునందతు వా సన్నసూయు రనసూయు రత్ర కింతేన,
 య త్సన్మానసగమనా యైవేదం మమ తు పాథేయమ్”

ప్రాచీనకవి.

హంసవింశతి యనునీపద్యకావ్యమును రచించిన యీమహాకవి యాఱువేలనియోగి బ్రాహ్మణుఁడు. కౌండిన్యసగోత్రుఁడు, సూరనార్యునకుం బుత్త్రుడు. ఈయన తల్లి కొండమాంబ. ఇంటిపే రయ్యలరాజువారు. ఇక్కవి స్వవిషయము నిట్లు చెప్పుకొన్నాఁడు.

“వ. వెండియు నఖండతేజఃకాండమార్తాండమండల ప్రచండుండును, నిజవితరణాకర్ణనకృశీభూతపారావారపునరభ్యుదయకారణానూనదానధారాప్రవాహసంజాతమహావాహినీవ్యూహుండును, నిస్తులప్రశస్తసద్గుణరత్నాకరుండును, .......... నారాయణామాత్య దేవేంద్రుఁడు కొండొక శుభవాసరంబున నత్యంతసంతోషితాంతఃకరుణుండై" అని

దీనింబట్టి చూడఁ గవులకు నైజమగు దరిద్రము తన్ను బాధింపఁ జాలకుండఁగా ధనసంపన్నుండై గొప్పదాతయై యున్నట్టు పొడకట్టుచున్నది. తన్నొకరు పురికొల్పఁ గాఁ గవిత్వమున కారంభించినట్లుగూడ నీతఁడు చెప్పుకొనకపోవుటంజూడఁ బైవిషయము స్థిరపడుచున్నది. ఇష్టదైవమగు శ్రీరామముర్తి స్వప్నమున సాక్షాత్కరించి నట్లు, గ్రంథమొనర్పం బురికొలిపినట్లు గూడఁ జెప్పుకొనలేదు. కారణమేమో. ఆశ్వాసాంత్యగద్యమునందు

"నిస్సహాయకవితానిర్మాణచాతుర్యనిస్తంద్ర,
 శ్రీరామనామపారాయణ నారాయణామాత్య ప్రణీతము.