పుట:హంసవింశతి.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxviii


రెండవ రాత్రి కథలో-

తే. ప్రాము జఠరాగ్నిచేఁ 'గిం కరోమి' యనుచు
    నడరు వేదనచేఁ 'గ్వ యాస్యామి' యనుచు
    విస్మయపు మూర్ఛచే 'నాహతో౽స్మి' యనుచుఁ
    బలువరింపంగ సాఁగె నబ్బక్క నక్క. (1-191)

ఈ నక్క పంచతంత్ర కథలోని కరటక దమనక జంబుక సంతతికిఁ జెందినదేమో! సంస్కృతము పలుకుచున్నదని నవ్వువచ్చును. ఈ శిల్పము నవ్వులాటకుఁ జేసిన శిల్పము కాదు. సద్బ్రాహ్మణుఁడు కాశికిఁ బోయి తెచ్చిన లింగమును బ్రతిష్ఠించి తదర్థము త్రవ్వించిన బావియొద్ద నక్క చావఁబోవుచున్న దన్న భావ్యర్థసూచనము చేయుటకుఁ జేసిన శిల్పము. జీవుఁడు వేల్పునేల పొలిమేరలు చూచుచున్నాఁడు. నక్క యెక్కడ? నాకలోక మెక్కడ ? అను నానుడి యిక్కడఁ బట్టదు. స్థలమహిమకు విలువకట్టవలెను.

పదునొకండవ రాత్రికథలో నొక పండితునిభార్య కఱవునఁబడి, యొకనాఁ డొక భిక్షువును గూడెను. ఆ భిక్షువు బ్రాహ్మణుఁడే కానీ, పొట్ట చించినను అక్షరము లేనివాఁడు. ఆకతాయి. రతి పారవశ్యమున బాపెత సంస్కృతము మాటాడును. అతఁడును మాటాడును. పండిత పత్ని కనుక ఆమె నాలుగు మాటలు కఱచి యుండును. ఇతనికి దేశాటన లాభముచే అబ్బియుండును. వింతయేమి? ఆనవచ్చు, నిజమే, కాని, తనుఁ దామఱచిన మైకమున నప్రయత్నముగా సంస్కృతభాష వెలువడునా? అని చూడవలెను. వీటి విటుల మనస్సులు మహానంద రసప్రవాహమునఁ దేలుచు మర్త్యలోకావరణమును దాఁటి స్వర్గలోకపు టంచున విహరించుచున్నవని చెప్పుట కవ్యభిప్రేత విషయము. ఆమాట వాచ్యముగా ననఁడు. సంస్కృత ప్రసంగముచే ధ్వనింపఁజేయును.

చ. "కురు సురతక్రియాం ప్రణయకోప మతిం త్యజ పూర్వసంగమం
    పరిచిను దేహి గాఢ భుజబంధన మంగజ శాస్త్రవాసనాం