పుట:హంసవింశతి.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 287

తత్ప్రయత్న మపుడె తగఁ జేసితని వార
లిరువు లెఱుఁగఁ బలికి యింటి కరిగె. 196

చ. అని కలహంసవంశమణి సాంగముగా వినిపించె వీనుదో
యినిఁ గడు సమ్మదమ్ము జనియింపఁగఁ దత్కథ యాలకించి కాం
చనసుమగంధి యా సతుల చాతురికాత్మ సెబాసటంచు మే
లనుచు గణించుకొంచు నిలయంబున కేగె నినుండు దోఁచినన్. 187

క. ఈరీతిఁ బడకటింటికి
జేరంజని మఱుసనాఁడు చీఁకటి జేజే
రారా కళ రా రాఁగల
యా రజనీవేళ విరహ మగ్గల మైనన్. 198

సీ. విరిదండ నెత్తావి నెఱి గుంపు గండుతు
మ్మెద పిండునకు మోద మొదవఁజేయఁ
గాశ్మీర తిలకంబు కాంతులు వదనేందు
బింబంబునకు సంజ డంబు గూర్పఁ
గస్తూరి పత్ర భంగముల నిగ్గు కపోల
శశి ఖండములకు లాంఛనము లీన
వాసించు నెఱ గందవడి పూఁత చనుగుబ్బ
పువ్వుగుత్తులకుఁ బుప్పొడులఁ గురియ
తే. నీలమణి కాంచి ఘృణులు విశాల జఘన
ధరణి కంబుధి మేఖలాత్వము ఘటింప
నృపతిమణిఁ జేరు కోర్కె నన్నీరజాక్షి
వచ్చి రాయంచకడ నిల్చె మెచ్చు లొల్క. 199

వ. అప్పుడు హేమావతికి హంసం బిట్లనియె. 200