పుట:హంసవింశతి.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxi


    వనమునఁ జిచ్చు దివ్యౌషధికినిఁబుప్పి
           బ్రతుకు బాలెడునింటఁ బరశురాము

తే. హస్త ముదకాన గ్రుడ్డు సస్యమునమల్లె
    జీవవితతికి రోగంబు చెఱకువెన్ను
    మణికి దోషంబు నృపునందు మార్దవంబు
    పుట్టుచందానఁ బుట్టెను బుత్రుఁడొకఁడు.
                                                  (హంస. 5-109)

కథాసంబంధి పద్యశిల్పము

నారాయణకవి చిత్రవాగ్లక్ష్మీ సంపన్నుఁడు. ఏకవింశతి నాయికల నెన్నికొని, యెక్కడ కక్కడఁ గ్రొత్త యనిపించి, బహుముఖమైన ప్రతిభాజ్యోతిని వెలిగించి వర్ణించినాఁడు. ఇతని గ్రంథమున కీ కొమ్మలే పట్టుగొమ్మలు.

ప్రధాన నాయిక హేమవతి. ఆమె రూపరేఖలు సిద్దస్త్రీ వర్ణించెను. ఱేఁడు మరులుకొనెను. యత్నించెను. కాని, యత్నము ఫలించలేదు.

"కబరీభరమునకుఁ గందంబు సెల్లు, నుత్పలమాలికలు నేత్రములకుఁజెల్లు " (1-62) అను పద్యమున ఆ మూర్తి మనసున కందునదేకాని, చేతికందునది కాదు అను ధ్వనివిశేషము చమత్కారము నతిశయించి పొడగట్టును.

ఇట్టిదే మఱొక పద్యము. అది బ్రాహ్మణీ రమణీయ భావము. బ్రహ్మవేత్తలను జీకాకుపఱచుట.

సీ. నెఱిగొప్పు నెఱరంగు నీలంపు సద్రుచుల్
           నారదభావంబు చూఱగొనఁగఁ
    గలికి కాటుకకంటి చెలువు భారద్వాజ
           గరిమంబునైనఁ జీకాకుపఱుప
    మించి సిబ్బెపు గుబ్బమినుకులు కుంభజ
           సద్వృత్తమంతయు జడియఁజేయ