పుట:హంసవింశతి.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 239



తే. మంట వెలుఁగున వేమాఱు మనసు దూలఁ
దళుకు దెలివాలుగన్నుల బెళుకుఁ జూచి
"యెప్పు డే గ్రామ మందుండు దేమి పనికి
నెచటి కేఁగెదు నీదు పేరేమి? చెపుమ! 226

క. అనిన సఖి కనియె “నుండుదు
ననిశంబు కిరాతదేశమందు, హిరణ్యుం
డనఁదగుఁ దన పేరిలఁ బు
ణ్యనదీనిధులెల్లఁ జూచి యరిగెదఁ బురికిన్. 227

చ. అని వచియించు తైర్థికున కా వనజాయతపత్రనేత్ర యి
ట్లను “నవయౌవనంబున రతాస్థఁ దొలంగి కులాబ్జగంధిపైఁ
గనికర మింతలేక తిరుగన్ మనసొగెనటోయి! నీకు?" నా
విని “నిజమౌను నీ పలుకు వేయననేల? వివాహహీనుఁడన్. 228

తే. ఆలి కే నంగలార్చుచు నన్యసతులఁ
జూచి గ్రుక్కిళ్లు మ్రింగుచు సుఖములేని
కతన యాత్రం జరెంచెడి కతయె కాని
మనసు సంభోగవాంఛల మరగి తిరుగు." 229

చ. అను పరదేశికుం గని మహాదరణంబున లేచి కౌఁగిఁటన్
నునుజిగి గబ్బిసిబ్బెపుఁ జనుంగవ నాటఁగఁ జేర్చి మోహముం
జినుకఁగ మోవినొక్కి మరుచివ్వకుఁ దార్చిన వాఁడు పేర్చుచుం
డిన తమిచేతఁ దద్రతికి దీవి సమున్ముఖుఁడై ముదంబునన్. 230

తే. గుబ్బలను నట్టు లూఁతఁగాఁ గొని మనోజ
కేళికావార్ధి లోపల నోలలాడు
చుండె నవ్వేళ దాని నాథుండు వచ్చి
“యెవరువా?" రని ఘర్షించి హెచ్చరింప. 231