పుట:హంసవింశతి.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 159



లందెల్ పాదుకలున్ మృగాజినము నిత్యం బొప్ప సంసారి యో
గీంద్రుండొక్కఁడు శూద్రుఁ డీశపద భక్త్యెకాగ్ర చిత్రాబ్జుఁడై . 185

వ. అతండు పృథివ్యప్తేజో వాయ్వాకాశంబులను పంచభూతంబులును, ద్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులను జ్ఞానేంద్రియంబులును, వాక్పాణి పాద పాయూపస్థలను కర్మేంద్రియంబులును శబ్ద స్పర్శ రూప రస గంధంబులను విషయంబులును మనోబుద్ది చిత్తాహంకారంబులను నంతఃకరణ చతుష్టయంబును జీవునితోఁగూడి పంచ వింశతి తత్త్వంబులగునని యెఱింగి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనం బరగు నష్టాంగ యోగంబులఁ జతురుండై కమల యోగ బ్రహ్మ గరుడ సుఖ వీర కూర్మ సిద్ధానంత కుక్కుటాసనంబుల నిశ్చలత నిలిచి రేచక పూరక కుంభంబులఁ, బ్రాణాపాన వ్యానోదాన సమానంబులను ప్రధాన వాయువులను నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయంబులను నుపవాయువులను స్వాధీనత నొందించి, యిడా పింగళా సుషుమ్నా మార్గంబులను, నున్మనీ మనోన్మనులను నాద బిందు కళలను సాంఖ్య తారకామనస్కంబులను మంత్ర హఠ లయ రాజ యోగంబులను మూలాధార స్వాధిష్ఠాన మణిపూరకానాహత విశుద్ధాజ్ఞా సహస్రారంబులను చక్రంబులను దెలియనేర్చి యాత్మాంతరాత్మ పరమాత్మజ్ఞానాత్మ స్వరూపంబు లెఱింగి సత్పురుషుల నాశ్రయించియుఁ దత్ఫలలబ్ధిఁ గానక కేవలంబు శైవమత ధురంధరుండై యుండె నంతట. 186

క. ఆరాధ్యుఁడు తమ వంశా
చారమునకు గురుమహత్త్వసత్తముఁడు ప్రియం
బారఁగ నతనికిఁ బెట్టిన
పేరును శివదత్తుఁడండ్రు బిసరుహగంధీ! 187

తే. సంతతంబును జంగమార్చనలు సల్పి
భౌమవారంబునను వీరభద్రు పళ్ళె