పుట:హంసవింశతి.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xx

శుకసప్తతిలోఁ బ్రధాననాయకుఁడు చిత్రభానుఁడు. కథారంగము పద్మావతీపురము.

హంసవింశతిలోఁ బ్రధాననాయకుఁడు చిత్రభోగుఁడు. కథారంగ ముజ్జయినీపురము.

శుకసప్తతిలోఁ గొరవంజి (ఎఱుకత); హంసవింశతిలో శివసత్తి (జోగురాలు).

శుకసప్తతిలో జగదేకసుందరి మదనసేనుఁడను వైశ్యుని భార్య ప్రభావతి.

హంసవింశతిలో జగదేకసుందరి విష్ణుదాసుఁడను సాతానిబేహారిభార్య హేమావతి. మదనుని తండ్రి విష్ణువు. ప్రభకుఁ దల్లి హేమము. కనుక మదనసేన ప్రభావతులకంటె విష్ణుదాస హేమవతులు అధికులు.

భూపతి జగదేకసుందరిని గోరుట, ఆమె యియ్యకొనుట, అంతలో గృహస్థుఁడు దూరదేశమేఁగుట, యిల్లాలు కడపదాఁటి అడుగిడఁజూచుట, పక్షి అడ్డగాలు వేయుట ఉభయత్ర సమానమే, అది శుకోపదేశము. ఇది (పరమ) హంసోపదేశము.

ఇకఁ బద్యము లెట్లు పోటీపడుచున్నవో చూడుఁడు.

సీ. చంద్రమతీనాథు చందాన, నలుని వై
           ఖరిఁ బురుకుత్సునిగతిఁ బురూర
   వునిమాడ్కి సగరులాగునఁ గార్తవీర్యుని
           యనువున గయునట్టు లంబరీషు
   పొలుపున శశిబిందువలె నంగుపోలికఁ
           బృథునిభాతి మరుత్తురీతి భరతు
   కరణి సుహోత్రుని హరువున రఘులీల
           రామునిక్రియ భగీరథుని ఠేవ